ఇంతకీ కొణతాల లక్ష్యం ఏమిటో?

మాజీ మంత్రి, మాజీ వైకాపా నేత కొణతాల రామకృష్ణ వ్యూహం లక్ష్యం ఏమిటో ఎవరికీ అంతుబట్టకుండా వ్యవహరిస్తున్నారు. కొంతకాలం క్రితం, ఉత్తరాంధ్రాలో వెనుకబడిన ప్రాంతాలని ఆదుకొని అభివృద్ధి చేయాలని, ఉత్తరాంధ్రా జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులని త్వరగా పూర్తి చేయాలని, ప్రత్యేక హోదా, రైల్వేజోన్, పోలవరం వంటి హామీలని అమలు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, ప్రధాని నరేంద్ర మోడీకి లేఖలు వ్రాసి వార్తలలో కనిపించారు.

మళ్ళీ నిన్న కొంచెం హడావుడి చేసి మీడియా దృష్టిలో పడ్డారు. రెండేళ్ళయినా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వనందుకు రక్షాబంధన్ సందర్భంగా నిన్న విన్నూత్న పద్దతిలో నిరసనలు తెలియజేశారు. విశాఖ జిల్లాలో ఆయనకి బాగా పట్టున్న కొన్ని గ్రామాలలో ప్రధాని నరేంద్ర మోడీ బొమ్మలని ఏర్పాటు చేసి, స్థానిక మహిళల చేత ఆ బొమ్మ చేతికి రాఖీలు కట్టించి ప్రత్యేక హోదా ఇవ్వాలని విజ్ఞప్తులు చేయించారు. ఇటువంటి నాటకీయ రాజకీయాల వలన ప్రత్యేక హోదా వస్తుందా? అంటే రాదనే అర్ధం అవుతుంది. మరి ఇటువంటి పనులు ఎందుకు చేస్తున్నట్లు అంటే ప్రజలని ఆకట్టుకొని తన ఉనికిని వారు గుర్తించేలా చేయడం కోసమేనని భావించవచ్చు.

ఒకవేళ ఆయన నిజంగా ప్రత్యేక హోదా కోరుకొంటున్నట్లయితే, ఇలాగ వీలున్నప్పుడు ఇటువంటి పనులు చేయడం కంటే, రాష్ట్రంలో దానికోసం పోరాడుతున్న పార్టీలతో, ప్రజా సంఘాలతో కలిసి పని చేస్తే ఏమైనా ప్రయోజనం ఉంటుంది. కనీసం ఆ రాఖీలు కడుతున్న గ్రామీణ మహిళలకి ప్రత్యేక హోదా అంటే ఏమిటో, దాని వలన రాష్ట్రానికి వారికీ ఏమి ప్రయోజనం కలుగుతుందో వివరించినా ఆయన శ్రమకి ఎంతో కొంత ఫలితం ఉండేది. ఒకవేళ ఆయన రాజకీయాలలో కొనసాగాలనుకొంటే నిరభ్యంతరంగా తనకు నచ్చిన రాజకీయ పార్టీలో చేరి ఎన్నికలలో పోటీ చేయవచ్చు. గెలిస్తే అధికారం చేపట్టవచ్చు. కానీ ఆ పని చేయకుండా ఈవిధంగా అగమ్యంగా ముందుకు సాగుతున్నారు. ఆయన ఏమి ఆశిస్తున్నారో…ఆయన రాజకీయ లక్ష్యం ఏమిటో? ఆయనకే తెలియాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close