క‌మిటీల ఏర్పాటుపై ఉత్త‌మ్ ఆద‌రాబాద‌రా అవుతున్నారే!

స‌మ‌యం లేదంటున్నారు. కార్య‌క‌ర్త‌లూ క‌మిటీల ఏర్పాట్లూ అన్నీ ఫ‌టాఫ‌ట్ అయిపోవాలని తొంద‌ర‌ప‌డుతున్నారు! ఈ నెలాఖ‌రులోపు క‌మిటీలు ఏర్పాట్లు అయిపోవాల‌నీ, వ‌చ్చే నెల తొలివారంలోగా కార్య‌క‌ర్త‌లంతా శ‌క్తి ఆప్ లో రిజిస్ట్రేష‌న్ చేసుకువాల‌ని తొంద‌ర‌పెడుతున్నారు తెలంగాణ పీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి. సంస్థాగ‌తంగా పార్టీని మ‌రింత బ‌లోపేతం చేయాల‌న్న ఉద్దేశంతో యుద్ధ ప్రాతిప‌దిక‌, అత్యంత వేగంగా చేయాల్సిన ప‌నులు కొన్ని ఉన్నాయ‌ని ఉత్త‌మ్ ప్ర‌క‌టించారు.

బూత్ క‌మిటీల‌ను 14 మందితో ఏర్పాటు చేయ‌డానికి ఈ నెలాఖ‌రే చివ‌రి తేదీ అన్నారు. కొన్ని మండ‌లాల్లో పార్టీ అధ్య‌క్షుడి నియామ‌కాలు కూడా ఈ నెలాఖ‌రుకే పూర్తి కావాల‌న్నారు. శ‌క్తి ఆప్ లో కార్య‌క‌ర్త‌లూ, క‌మిటీలు రిజిస్ట్రేష‌న్ చేసుకోవ‌డానికి చివ‌రి తేదీ కూడా ఈ నెలాఖ‌రే అన్నారు. అర్బ‌న్ ప్రాంతాల్లో డివిజ‌న్ క‌మిటీలు ఏర్పాటు చేసుకోవ‌డంలో కొంత ఆల‌స్యం జ‌రిగింద‌నీ, హైద‌రాబాద్ ప్రాంతంలో కూడా పార్టీ కింది స్థాయి నియామ‌కాల విష‌యంలో కొన్ని పెండింగ్ ఉన్నాయ‌ని ఉత్త‌మ్ చెప్పారు. శ‌క్తి ఆప్ కింద రాష్ట్రంలోని కార్య‌క‌ర్త‌లంద‌రూ రిజిస్ట‌ర్ కావాల‌నీ, వారికి వ‌చ్చే నెల 15 వ‌ర‌కూ మాత్ర‌మే స‌మ‌యం ఉన్న‌ట్టు ప్ర‌క‌టించారు! రాష్ట్రంలోని 31 జిల్లాల‌కీ కొత్త క‌మిటీల ఏర్పాటుపై కూడా చ‌ర్చ‌లు జ‌రిగాయ‌న్నారు. త్వ‌ర‌లోనే కుంతియాతో కూర్చుని మ‌రిన్ని కీల‌క నిర్ణ‌యాలు తీసుకోవాల్సి ఉంద‌న్నారు.

పార్టీ ప‌టిష్ట‌త‌పై దృష్టి పెట్ట‌డం మంచిదేగానీ.. దాన్ని ఇంత ఆద‌రాబాద‌రాగా చేయాల్సిన పనేముంద‌నేదే ప్ర‌శ్న‌..? శ‌క్తి ఆప్ కింద కార్య‌క‌ర్త‌ల న‌మోదుకు కూడా చివ‌రి తేదీ పెట్టి, ఆలోగానే రిజిస్ట‌ర్ అయి తీరాల‌ని తొంద‌ర‌పెడితే ఎలా..? అయినా, ఈ కార్య‌క్ర‌మాల‌న్నీ ప‌దిరోజుల్లోపే జ‌రిగిపోవాల‌ని ఇప్పుడు కంగారుప‌డ‌టంలోనే.. ఆ పార్టీ వ్యూహంలోని లోపం క‌నిపిస్తోంది. పార్టీ క‌మిటీలు, మండ‌ల స్థాయి నియామ‌కాలు, అర్బ‌న్ ప్రాంత డివిజ‌న్ కమిటీలు అనేవి ఇప్ప‌టికే వేసి ఉండొచ్చు. రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్ప‌డిన ద‌గ్గ‌ర నుంచే ఈ ప్ర‌య‌త్నాలు మొద‌లుపెడితే బాగుండేది

పార్టీ ప‌టిష్ట‌త విష‌యంలో తెలంగాణ కాంగ్రెస్ ప్లానింగ్ స‌రిగా లేద‌న్న‌ది మొద‌ట్నుంచీ విశ్లేష‌కులూ విమ‌ర్శ‌లూ చెబుతూ ఉన్నదే. పీసీసీగానీ, సీఎల్పీగానీ ఇన్నాళ్లూ కేవ‌లం పార్టీ అంత‌ర్గ‌త వ్య‌వ‌హారాలూ ఆధిప‌త్య పోరాటాల‌కు మాత్ర‌మే ప్రాధాన్య‌త ఇస్తూ వ‌చ్చారు. ఇప్పుడు హ‌ఠాత్తుగా ఏఐసీసీ చెప్పింద‌నీ, రాహుల్ గాంధీ దిశా నిర్దేశించారంటూ తొంద‌ర‌ప‌డుతున్నారు. పార్టీకి అత్యంత కీల‌క‌మైన బూత్ క‌మిటీలు, కిందిస్థాయి నియామ‌కాల‌పై ఇలా ప్రాధాన్య‌త లేని కార్య‌క్ర‌మాలుగా పూర్తిచేయాల‌నుకోవ‌డం పార్టీ బ‌లోపేతానికి ప‌నికొచ్చే చ‌ర్య అవునో కాదో వారికే తెలియాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close