“వ్యాక్సిన్ ఆర్డర్ల”పై ఎవరి వాదన నిజం..!?

రూ. పదహారు వందల కోట్ల ఖర్చు పెడితే ప్రజలందరికీ వ్యాక్సిన్ ఇవ్వొచ్చని.. కానీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని టీడీపీ ఆరోపిస్తోంది. ప్రజల ప్రాణాల్ని బలి తీసుకుంటున్నారని అంటున్నారు. మరో వైపు ప్రభుత్వం అదే స్థాయిలో ఎదురుదాడి చేస్తోంది. వ్యాక్సిన్ విధానం పూర్తిగా కేంద్రం వద్ద ఉంది. కేంద్రం ఎంత చెబితే.. అంత కొనుగోలు చేయాలి తప్ప.. ఇష్టం వచ్చినట్లుగా కొనుగోలు చేయడాని కి లేదని చంద్రబాబుకు తెలీదా అని ప్రెస్‌మీట్లు పెట్టి మరీ.. సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపిస్తున్నారు. అయితే.. రాష్ట్ర ప్రభుత్వానికి టీడీపీ వెంటనే కౌంటర్ ఇస్తోంది.

వ్యాక్సిన్ కంపెనీల వద్ద యాబై శాతం కేంద్రం తీసుకుంటుందని.. మిగతా యాభై శాతం రాష్ట్రాలు, ప్రైవేటు ఆస్పత్రులకు అమ్ముకునేందుకు పర్మిషన్ ఇచ్చిందని.. అనేక రాష్ట్రాలు ఆర్డర్లు పెట్టుకుని కొనుగోలు చేస్తున్నాయని అంటున్నారు. ఇప్పటికే ఆర్డర్లు పెట్టిన రాష్ట్రాలకు టీకాలు ఇస్తున్నారని.. అదే సమయంలో.. ఏపీ సర్కార్ లేఖలు మాత్రమే రాసిందని.. ఆర్డర్లు పెట్టలేదని అంటోంది. అయితే ఈ వాదనను..ప్రభుత్వం తోసి పుచ్చింది. రాష్ట్రాలకు ఎంత వ్యాక్సిన్ ఇవ్వాలో మొత్తంగా కేంద్రమే నిర్ణయిస్తోందని వాదిస్తోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య ఈ వ్యాక్సిన్ వివాదం తీవ్ర స్థాయిలో నడుస్తోంది. అధికార పార్టీ అసహనానికి గురై.. కేసులు పెట్టే ప్రయత్నం చేస్తోంది.

చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి.. చంద్రబాబుపై దేశద్రోహం కేసులు పెట్టాలని మండిపడ్డారు. బహుశా.. ఏపీ హోంశాఖ ఆయన కనుసన్నల్లోనే ఉందని ప్రచారం జరుగుతున్నందున.. రేపో మాపో… ప్రతిపక్ష నేతలపై.. దేశద్రోహం కేసులు పెట్టినా ఆశ్చర్యం లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది. టీకాల వెనుక రాజకీయం చాలా జరుగుతోంది కానీ.. అసలు.. టీకాల విధానంలో ఎవరు చెబుతోంది నిజం అన్నది మాత్రం.. బయటకు రానీయడం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close