వంశీ ఎమ్మెల్యేగా ఉంటారట..!

గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇప్పుడల్లా వైసీపీలో చేరే సూచనలు కనిపించడం లేదు. జగన్మోహన్ రెడ్డి ఉపఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా లేకపోవడంతో.. ఆయన పార్టీలో చేరికను ఎప్పటికప్పుడు వాయిదా వేస్తున్నారు. అదే సమయంలో.. ఒక వేళ వైసీపీలో చేరి.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినా.. వంశీకి టిక్కెట్ ఇవ్వడం అంత.. తేలికైన విషయం కాదని వైసీపీలో ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో.. ఆర్థికంగా.. విపరీతంగా ఖర్చు పెట్టుకున్న యార్లగడ్డ వెంకట్రావు.. రచ్చ చేస్తారని దాని వల్ల పార్టీకి డ్యామేజ్ అవుతుందని వైసీపీ వ్యూహకర్తలు అంచనా వేస్తున్నారు. అందుకే.. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల కారణంగా.. వంశీని టీడీపీకి దూరం చేయడం వరకే పరిమితం అవ్వాలని.. అంత కన్నా అడ్వాన్స్ అవసరం లేదని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

జగన్ అలా గాల్లో ఉంచేయడంపై వల్లభనేని వంశీకి ఇప్పుడు క్లారిటీ వస్తోంది. తాను ఎమ్మెల్యేగా కొనసాగుతానని అనుచరులకు చెప్పుకొస్తున్నారు. తాను టీడీపీకి దూరం అయిన తర్వాత నియోజకవర్గంలో కొంత మంది అనుచరులు.. దూరం కావడంతో.. వారందర్నీ మళ్లీ తనతో పాటు నడిచేలా చేసుకునేందుకు ఆయన గ్రామాలు పర్యటిస్తున్నారు. తాను ఎమ్మెల్యేగా ఉంటానని.. టీడీపీకి దూరం అయినందున.. వైసీపీకి దగ్గరగా ఉన్నందున.. ప్రభుత్వం తరపున పనులు అవుతాయని.. చీటికి మాటికి కేసులు ఉండవని.. ఆయన అనుచరులకు చెబుతున్నారు. కొంత మంది వల్లభనేని వంశీ వాదనతో ఏకీభవించి ఆయనతో.. అటూ ఇటూ కాకుండా.. ఏ పార్టీలో లేకుండా ఉండేందుకు సిద్ధమయ్యారు.

జగన్మోహన్ రెడ్డి.. తన పార్టీలో ఎవరు చేరాలన్నా… రాజీనామా చేసి తీరాల్సిందేనని ఓ నియమం పెట్టుకున్నారు. అసెంబ్లీలోనే కాదు బయట కూడా ఈ నీతి వాక్యాలను ప్రవచించారు. అలాగే… స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా… ఇదే సూత్రాలను వల్లించారు. టీడీపీ రాజ్యసభ సభ్యులను..  బీజేపీలో విలీనం చేసినప్పుడు.. నేరుగా ఆయనపైనే విమర్శలు చేశారు. అలాంటిది ఇప్పుడు.. వంశీ.. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ఉల్లంఘించినట్లు తేలిన తర్వాత చర్యలు తీసుకోకపోతే.. ప్రజల్లోకి మరో రకంగా వెళ్తుంది. ఈ కారణంగానే వంశీ వైసీపీలో చేరిక.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా ఆలస్యం అవుతోంది. తర్వాత వ్యూహం మార్చుకున్నప్పుడు.. ఆయన రాజీనామా చేసి.. వైసీపీలో చేరే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close