రాయభారి ఆగడానికి కారణం అదేనా..!

విలక్షణ దర్శకుడు క్రిష్ నుండి ఎలాంటి సినిమాలు వస్తాయో అందరికి తెలుసు. ఎవరికి తెలియకుండా షూటింగ్ చేసుకువచ్చి సడెన్ గా అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తుతాడు క్రిష్. మొదటి సినిమా గమ్యం నుండి క్రిష్ సినిమాలన్ని ఎంతో వైవిధ్యంగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాయి. ఇక లాస్ట్ ఇయర్ వరుణ్ తేజ్ తో తీసిన కంచె పరిశ్రమ దిగ్గజ దర్శక నిర్మాతలు సైతం వారెవా అనేలా చేసింది.

ఇదే కాంబినేషన్ లో రాయభారి అనే సినిమా చేయడానికి పూనుకున్నారు చిత్ర యూనిట్. సినిమాకు సంబందించిన లొకేషన్స్ వేటలో పడి జార్జియా దాకా వెళ్లారట దర్శకుడు క్రిష్ ఇంకా తనకు సంబందించిన టెక్నికల్ టీం. అయితే సినిమా అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువవుతుందని భావించి సినిమా మధ్యలో ఆపేసే ఆలోచనలో ఉన్నారట. వరుణ్ తేజ్ ప్రస్తుతం ఉన్న మార్కెట్ కన్నా సినిమా బడ్జెట్ మరో రెండు రెట్లు ఎక్కువ ఖర్చు అయ్యే సూచనలు కనిపిస్తున్నాయట అందుకే సినిమాను ఏం చేయాలో తోచక కొద్దిరోజులు ఆపారని తెలుస్తుంది.

సరైన కథ కథనాలుంటే వరుణ్ తేజ్ అయినా సరే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టగలడు. మరి ఎందుకు క్రిష్ ఇలా వెనుకడుగు వేస్తున్నాడో తెలియట్లేదు. అయితే ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న మరో రూమర్ ఏంటంటే క్రిష్ కూడా బాలయ్యకు సూట్ అయ్యే ఓ కథతో తనని కలిశాడని దాన్ని డెవలప్ చేసే పనిలోనే రాయభారికి బ్రేక్ ఇచ్చారని అంటున్నారు. మరి రాయభారి నిజంగా బ్రేక్ పడ్డదా.. క్రిష్ బాలయ్య సినిమాకు దర్శకత్వం వహిస్తాడా అన్న వాటికి సమాధానం త్వరలో తెలుస్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

ఆయన 20 మంది ఎమ్మెల్యేలతో వచ్చేత్తా అంటే కేసీఆరే వద్దన్నారట !

కాంగ్రెస్ ప్రభుత్వం తన దయా దాక్షిణ్యాల మీదనే ఆధారపడి ఉందని అంటున్నారు కేసీఆర్. ఎందుకంటే ఇరవై మంది ఎమ్మెల్యేలను తీసుకుని వచ్చే ఓ సీనియర్ నేత .. కేసీఆర్ తో టచ్...

కేంద్ర‌మంత్రిగా ఈట‌ల రాజేంద‌ర్… బీజేపీ అగ్రనేత జోస్యం!

మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ కేంద్ర‌మంత్రి కాబోతున్నారా...? మ‌ల్కాజ్ గిరి దీవించి పంపితే జ‌రిగేది అదే అంటూ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు కేంద్ర‌మంత్రి. మల్కాజ్ గిరిలో ఈట‌ల గెలిస్తే కేంద్ర‌మంత్రి అవుతారు అంటూ...

జైల్లో కేజ్రీవాల్ మామిడిపండ్లు తింటున్నారు…ఈడీ కొత్త ఆరోపణ

లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ షుగర్ లెవల్ పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది ఈడీ. వైద్య పరమైన సాకులతో బెయిల్ పొందేందుకుగాను కేజ్రీవాల్ మామిడిపండ్లు, స్వీట్లు ఉద్దేశ్యపూర్వకంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close