వెంకయ్య నాయుడు కనిపించుట లేదు!

‘కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు కనిపించుట లేదు’ అని పత్రికలలో ప్రకటన వేయవలసిన అవసరం కనబడుతోంది. ఇదివరకు ఆయన వారానికి ఒక్కసారైనా ఆంధ్రాలో ఏదో ఒక ప్రాంతంలో కనబడుతుండేవారు. కానీ ప్రత్యేక హోదాపై మళ్ళీ రాష్ట్రంలో వేడి పెరిగినప్పటి నుంచి ఆయనరాష్ట్రానికి రాకుండా డిల్లీకే పరిమితం అయిపోయారు. పైగా భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ సిద్ధార్ద్ నాథ్ సింగ్ నేరుగా విజయవాడకే వచ్చి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే ఉద్దేశ్యం లేదు.. ఇవ్వము అని కుండ బ్రద్దలు కొట్టినట్లు ప్రకటించడం, ఆ కారణంగా తెదేపా-భాజపాల మద్య చాలా ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉండటంతో వెంకయ్య నాయుడు రాష్ట్రానికి వచ్చే ఆలోచన మానుకొన్నట్లున్నారు. ఆయన ఎప్పుడు రాష్ట్రానికి వచ్చినా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని పొగడకుండా వెళ్లరు. ప్రస్తుత పరిస్థితులలో ఆయన వచ్చి మాట్లాడితే తెదేపాపై కత్తులు దూస్తున్న రాష్ట్ర భాజపా నేతలకు కూడా ఆగ్రహం, ఇబ్బంది కలిగించినవారవుతారు. ఈసారి ఆయన తెదేపా తరపున రాజ్యసభకి వెళ్ళవచ్చని ఇదివరకు ఊహాగానాలు వినిపించాయి. కానీ తెదేపా తరపున రాజ్యసభకి వెళ్ళిన నిర్మలా సీతారామన్ కి కూడా తెదేపా మళ్ళీ సీటు ఇచ్చే ఉద్దేశ్యం లేదని స్పష్టం చేయడంతో రెండు పార్టీల మద్య ఇంకా దూరం పెరిగింది. బహుశః అందుకే ఆయన రాష్ట్రానికి మొహం చాటేసినట్లున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వివేకా హత్య కేసులోకి జగన్‌నూ లాక్కొస్తున్న దస్తగిరి !

మావాళ్లు చెప్పినట్లు చేయి.. ఏం జరిగినా అండగా ఉంటానని దస్తగిరికి సీఎం జగన్ స్వయంగా హామీ ఇచ్చారట. ఈ విషయాన్ని స్వయంగా దస్తగిరినే చెబుతున్నారు. వివేకాను చంపే ముందు జగన్ ఆయనతో ఫోన్...

ఖమ్మం సీటు రిస్క్ లో పడేసుకున్న కాంగ్రెస్

కాంగ్రెస్ పార్టీ అత్యంత సులువుగా గెలిచే సీటు ఖమ్మం అనుకున్నారు. మిత్రపక్షంతో కలిసి ఆ లోక్ సభ పరిధిలో ఉన్న అన్ని చోట్లా గెలిచారు. అదీ కూడా భారీ మెజార్టీలతో. ...

ఇప్పటికీ ఎన్డీఏ వెంట పడుతున్న జగన్ !

రాజకీయం అంటే విదిలించుకున్నా వదిలి పెట్టను అని కాళ్లు పట్టేసుకోవడం కాదు. కానీ వైసీపీ అధినేతకు మాత్రం అదే రాజకీయం. ఎందుకంటే వదిలిస్తే కేసులకు కొట్టుకుపోతారు. అందుకే బీజేపీ వాళ్లు విదిలించుకున్నా ...

ఆన్న ఆస్తి ఇవ్వకపోతే షర్మిల కోర్టుకెళ్లవచ్చుగా !?

సోదరుడు జగన్మోహన్ రెడ్డి ఆస్తి పంచివ్వలేదని.. ఒక్కకొసరు ఆస్తి రాసిచ్చి దాన్ని కూడా అప్పు కింద జమ చేసుకున్నారని షర్మిల వేదనకు గురయ్యారు. తన పిల్లలకు తాను ఏమీ ఇవ్వలేకపోతున్నానని ఆమె ఆవేదన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close