పొలిటికల్ నేపథ్యంలో కథలకు కొత్త ఊపు వచ్చింది. ‘భరత్ అనే నేను’ పొలిటికల్ స్టోరీనే. ‘రంగస్థలం’లోనూ రాజకీయాల ప్రస్తావన ఉంది. ‘ఓటర్’ టైటిల్ చూస్తే ఇదే తరహా చిత్రమో తెలిసిపోతుంది. ఇప్పుడు విజయ్ దేవరకొండ కూడా అలాంటి కథే ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ‘అర్జున్ రెడ్డి’తో తెలుగులో మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు విజయ్. ఇప్పుడు స్డూడియో గ్రీన్ సంస్థలో ఓసినిమా చేస్తున్నాడు. ఆనంద్ శంకర్ దర్శకుడు. ఈరోజే ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది. ఇదో పొలిటికల్ థ్రిల్లర్ అని సమాచారం. వారసత్వ రాజకీయాల నేపథ్యంలో సాగబోతోందట. మరీ ముఖ్యంగా తమిళ నాడు రాజకీయాలపై సెటైరిక్గా సాగుతుందని తెలుస్తోంది. తమిళ నాట రాజకీయాలు ఉప్పుడూ ఆసక్తిని రేకెత్తిస్తూ ఉంటాయి. సినీ ఫక్కీలో రాజకీయ వాతావరణం ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. వాటి నేపథ్యంలోనే ఈసినిమా సాగబోతోందని తెలుస్తోంది. తెలుగుతో పాటు ఈ చిత్రాన్ని తమిళంలోనూ విడుదల చేయనున్నారు. కాబట్టే తమిళ రాజకీయాల్ని టార్గెట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మెహరీన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో నాజర్, సత్యరాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.