ఆగ‌స్టు 25న ఇండియా షేకైపోతుంది: విజ‌య్ దేవ‌ర‌కొండ‌

విజ‌య్ దేవ‌ర‌కొండ `లైగ‌ర్‌` ట్రైల‌ర్ అంద‌రినీ ఊపేస్తోంది. ఈ ట్రైల‌ర్ రిలీజ్ ఈవెంట్ హైద‌రాబాద్‌లోని సుద‌ర్శ‌న్ థియేట‌ర్లో జ‌రిగింది. థియేట‌రంతా.. రౌడీ ఫ్యాన్స్‌తో నిండిపోయింది. ఫ్యాన్స్ ని చూసిన ఆనందంలో విజ‌య్‌. చాలా ఉద్వేగంగా మాట్లాడాడు. ”మీకు మా అయ్య తెలీదు మా తాత తెలీదు. ఎవ్వ‌డూ తెలీదు. సినిమా రిలీజ్ అయి రెండేళ్ల‌య్యింది. ముందు రిలీజ్ అయిన సినిమా కూడా పెద్ద‌గా చెప్పుకొనే సినిమా కాదు. అయినా ట్రైల‌ర్ కే ఇంత రచ్చేంద్రా నాయినా.. డాన్సంటే నాకు చిరాకు… అంత డాన్స్ చేశానంటే కార‌ణం.. నా ఫ్యాన్స్‌ ఎంజాయ్ చేయాలి.. అని చేశా. ఈ సినిమాని మా ఫ్యాన్స్‌కి అంకితం చేస్తున్నా. ఆగ‌స్టు 25 థియేట‌ర్లు నిండిపోవాలి. గ్యారెంటీగా చెబుతున్నా. ఆగ‌స్టు 25 ఇండియా షేక్ అయిపోతుంది. ప్ర‌మోష‌న్లు లేట్ అయ్యింద‌ని మీరంతా ఫీల‌య్యారు.. ఇప్పుడు బుల్లెట్ దిగిందా, లేదా??” అంటూ… ఎప్ప‌టిలానే హుషారుగా మాట్లాడాడు. పూరి కూడా ఈ సినిమాపై బోలెడంత న‌మ్మ‌కంతో ఉన్నాడు. ”రాసుకోండి.. ఆగ‌స్టు 25న‌… ఇండియాకి ఓ కొత్త సూప‌ర్ స్టార్ వ‌స్తున్నాడు..” అంటూ పూన‌కంతో ఊగిపోయాడు. ”క‌ర‌ణ్ జోహార్‌ని ఇక్క‌డికి తీసుకొచ్చింది లైగ‌ర్ ట్రైల‌ర్‌ని చూపించ‌డానికి కాదు.. మిమ్మ‌ల్ని చూపించ‌డానికి” అంటూ అభిమానుల్ని ఉద్దేశించి అన్నాడు పూరి. మొత్తానికి ఈవెంట్… `లైగ‌ర్‌` ప్ర‌మోష‌న్ల‌కు క‌ర్టెన్ రైజ‌ర్ లా ఉప‌యోగ‌ప‌డింద‌న‌డానికి ఎలాంటి సందేహం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘కాంతార 2’లో మోహ‌న్ లాల్‌?

దేశాన్ని కుదిపేసిన క‌న్న‌డ చిత్రం 'కాంతార‌'. ఏమాత్రం అంచ‌నాలు లేకుండా, ఏమాత్రం ప్ర‌మోష‌న్లు చేయ‌కుండానే పాన్ ఇండియా స్థాయిలో విజ‌య ఢంకా మోగించింది. క‌న్న‌డ చిత్ర‌సీమ స్థాయిని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసింది. ఇప్పుడు...

మంత్రి ఉత్తమ్ ఇలాకాలో విద్యార్ధినిలకు అస్వస్థత..రీజన్ అదేనా..?

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని గురుకుల పాఠశాలలో విద్యార్థులు వరుసగా అస్వస్థతకు గురి అవుతుండటం కలకలం రేపుతోంది. యదాద్రి భువనగిరి జిల్లా గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కు గురై ఇటీవల ఓ విద్యార్ధి...

చిలుకూరుకు పోటెత్తిన భక్తులు…ఫుల్ ట్రాఫిక్ జామ్

కోరిన కోరికల్ని తీర్చే సుప్రసిద్ధ చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలకు భక్తులు పోటెత్తారు. ఆలయ సిబ్బంది అంచనా వేసిన దానికంటే పది రేట్లు ఎక్కువగా రావడంతో క్యూలైన్లు అన్ని నిండిపోయాయి. ఆలయానికి...

అచ్చెన్నాయుడు అన్నీ అలా కలసి వస్తున్నాయంతే !

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు అన్నీ అలా కలసి వస్తున్నాయి. ఆయన ప్రత్యర్థి .. దువ్వాడ శ్రీనివాస్.. భార్య చేతిలోనే పదే పదే ఓడిపోతున్నారు. తాజాగా మరోసారి ఆయన భార్య రంగంలోకి దిగారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close