ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో విజయసాయిరెడ్డి అల్లుడి సోదరుడు అరెస్ట్ !

ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ దూకుడు పెంచింది. మరో ఇద్దరిని అరెస్ట్ చేసింది. వీరిలో ఒకరు శరత్ చంద్రారెడ్డి. ఈయన విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డి సోదరుడు. అరబిందో ఫార్మా డైరక్టర్. మరోకరు తెలంగాణకు చెందిన వినయ్ బాబు. వీరిద్దరూ పెద్ద ఎత్తున బ్లాక్ మనీని వైట్ చేయడానికి .. ఢిల్లీ లిక్కర్ లాబీలో పెట్టుబడులు పెట్టినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. దాదాపుగా రూ. రెండు వేల కోట్ల వరకూ అరబిందో నుంచి .. ఢిల్లీ లిక్కర్ సిండికేట్‌లోకి ప్రవహించాయని తెలుస్తోంది.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఇప్పటికి మూడు అరెస్టులు జరిగాయి. తెలంగాణ అధికార పార్టీ పెద్దలకు బినామీగా భావిస్తున్న రామచంద్ర పిళ్లైను అరెస్ట్ చేయలేదు. కానీ అభిషేక్ రావును అరెస్ట్ చేశారు. రామచంద్ర పిళ్లై అప్రూవర్‌గా మారేందుకు అంగీకరించారన్న ప్రచారం జరుగుతోంది. ఆయన చాలా విషయాలు సీబీఐకి చెప్పారని అంటున్నారు. అందుకే అభిషేక్ రావును అరెస్ట్ చేశారని .. శరత్ చంద్రారెడ్డిలపై కూడా స్పష్టమైన ఆధారాలు లభించడంతో అరెస్ట్ చేసినట్లుగా చెబుతున్నారు. వైసీపీ ఎంపీ లిక్కర్ వ్యాపారి మాగుంట శ్రీనివాసులరెడ్డి కుమారుడు రాఘవరెడ్డిని కూడా ప్రశ్నించింది.

అరబిందో శరత్ చంద్రారెడ్డి.. విజయసాయిరెడ్డి అల్లురు రోహిత్ రెడ్డి ..సోదరుడు. అరబిందోలో కీలక బాధ్యతల్లో ఉన్నారు. ఇప్పుడు ఆయనకు అరెస్ట్ ముప్పు పొంచి ఉంది. అల్లుడి సోదరుడ్ని కాపాడేందుకు విజయసాయిరెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని ఢిల్లీలో ప్రచారం జరుగుతోంది. మోదీ విశాఖ పర్యటన సందర్భంగా .. పర్యటన విజయవంతం చేసే బాధ్యతను విజయసాయిరెడ్డి తీసుకున్నారు. కానీ మోదీ ఏపీకి రాక ముందే అల్లుడి సోదరుడ్ని అరెస్ట్ చేశారు.

అరబిందో వ్యవహారాల్లో.. విజయసాయిరెడ్డి పాత్ర కీలకంగా ఉంటుందన్న ప్రచారం చాలా కాలంగా ఉంది. ఇప్పుడు విజయసాయిరెడ్డి లెక్కల ధాటికి అరబిందో ఫార్మా.. మరో సత్యం సంస్థలా అవుతుందన్న అభిప్రాయం వినిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close