ఏపీ ప్రభుత్వ వేధింపు వల్లే ఆత్మహత్య..! పోలీసులకు కోడెల కుమార్తె ఫిర్యాదు..!

కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యకు ఏపీ ప్రభుత్వ వేధింపులే కారణమని… ఆయన కుమార్తె విజయలక్ష్మి హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజకీయ కక్షలతోనే.. గత మూడు నెలలుగా తండ్రి కోడెల, సోదరుడు శివరాంపై… తప్పుడు కేసులు పెట్టి వేధించారని…విజయలక్ష్మి ఫిర్యాదులో తెలిపింది. ప్రస్తుతం పోలీసులు ఈ కేసును సీరియస్ గా దర్యాప్తు చేస్తున్నారు. కోడెల ఆత్మహత్య చేసుకున్న గదిని సీజ్ చేశారు. ఆయన వ్యక్తిగత ఫోన్ ను స్వాధీనం చేసుకుని కాల్ లిస్ట్ ను పరిశీలిస్తున్నారు. మరో వైపు ఈ కేసును… సీబీఐ లేదా… మరో ఇతర కేంద్ర దర్యాప్తు సంస్థతో దర్యాప్తు చేయించాలన్న లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ ఉంది. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందా అన్నదానిపై ఆసక్తి ఏర్పడింది.

పోస్టుమార్టం, ఫోరెన్సిక్ నివేదిక ప్రకారం… కోడెల ఆత్మహత్య చేసుకున్నట్లుగా స్పష్టమయింది. దాంతో ఇప్పుడు.. ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలేమిటి..? బాధ్యులు ఎవరు అన్నదానిపై పోలీసులు విచారణ జరపాల్సి ఉంది. గత మూడు నెలలుగా కోడెల తీవ్రమైన మానసిక క్షోభకు గురవుతున్నారని .. కోడెల కుమార్తె విజయలక్ష్మి … సోమవారం.. మీడియా సమావేశంలో కన్నీరు పెట్టుకుంటూ చెప్పారు. ఈ మానసిక క్షోభకు కారణం ఏమిటి..? కారకులెవరన్నది తేలాల్సి ఉందని టీడీపీ నేతలంటున్నారు. గత మూడు నెలల్లోనే ఆయనపై పందొమ్మిది కేసులు పెట్టడం, జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి మీడియాలో… కోడెలపై వచ్చిన అసత్యకథనాలు, ప్రతీ విషయానికి ఆయనతో లింక్ పెట్టడం..తదితర అంశాలన్నింటినీ టీడీపీ నేతలు ఇప్పటికే పోలీసుల దృష్టికి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు.

అయితే.. కేసును లైట్ తీసుకోవాలా.. సీరియస్ గా విచారణ చేయాలా అన్నది… తెలంగాణ పోలీసుల మీదే ఆధారపడి ఉంది. తెలంగాణ పోలీసులపై నమ్మకం లేకపోతే.. కోడెల కుటుంబసభ్యులు సీబీఐ విచారణ కోసం కోర్టుకెళ్లే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close