విజయసాయిరెడ్డి పదవి ఊడబీకిన జగన్..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెంబర్ టూ విజయసాయిరెడ్డికి జగన్మోహన్ రెడ్డి… షాక్ ఇచ్చారు. ఆయనకు.. ఇచ్చిన పదవిని.. ఉన్న పళంగా పీకేశారు. ఏపీ సర్కార్ తరపున ఢిల్లీలో ప్రతినిధిగా వ్యవహరించడానికి.. విజయసాయిరెడ్డికి.. జగన్ అధికారం ఇచ్చారు. ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా నియమించారు. ఈ మేరకు గత నెల 22వ తేదీన జీవో నెంబర్ 68ని రిలీజ్ చేశారు. అయితే హఠాత్తుగా.. ఏపీ సర్కార్ ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా విజయసాయిరెడ్డిని తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జీవో 68ని ఉపసంహరించుకుంది. విజయసాయిరెడ్డికి ఎంపీ పదవి ఉన్నందున.. నియామకాన్ని వెనక్కు తీసుకుంటున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. విజయసాయిరెడ్డి స్థానంలో మరొకరిని నియమిస్తామని తెలిపింది.

అయితే విజయసాయిరెడ్డిని ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా నియమించేటప్పుడు.. కూడా ఆయనకు ఎంపీ పదవి ఉంది. అయినప్పటికీ.. పదవి ఇచ్చారు. ఇప్పుడు.. కొత్తగా పదవి ఉందన్న కారణంగా విజయసాయిరెడ్డిని తొలగించడం ఏమిటన్నది చాలా మందికి అంతు బట్టని విషయం. పరస్పర విరుద్ధ ప్రయోజనాల కిందకు వస్తుందేమోనని… భయపడటానికి… ఇవేమీ వ్యక్తిగత సేవల కిందకు రావు. నిబంధనలు అంగీకరించకపోవడానికి కూడా అవకాశం లేదు. ఏపీ సర్కార్.. తన ప్రతినిధిగా.. ఢిల్లీలో ఎవరినైనా నియమించుకోవచ్చు. ఎంపీ పదవి ఉండకూడదనే రూలేమీ ప్రత్యేకంగా లేదు. అది ప్రభుత్వ ఇష్టం.

అయితే.. పార్టీ నేతలకు.. పదవులు కల్పించడానికి.. ఇలాంటి పదవులతో భర్తీ చేస్తారు. ఢిల్లీలో మంచి సంబంధాలు ఉన్న నేతలకు అవకాశం ఇస్తారు. వైసీపీకి సంబంధించినంత వరకు.. విజయసాయిరెడ్డికి ఢిల్లీలో ఉన్నన్ని పరిచయాలు మరెవరికీ లేవు. అయినా కానీ.. హడావుడిగా… నియామకం జరిపిన సర్కార్.. అంతే హడావుడిగా.. వెనక్కి తీసుకుంది. విజయసాయిరెడ్డికి పదవిని ఊడబీకడంలో.. జగన్ ఉద్దేశమేమిటో కానీ.. వైసీపీలో మాత్రం ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close