తలసాని వ్యాఖ్యలకు విజయశాంతి కౌంటర్లు

కాంగ్రెస్ నేత విజయశాంతి త్వరలోనే బిజెపి లోకి చేరబోతున్నారని గత కొద్దిరోజులుగా ఊహాగానాలు వస్తున్నాయి. అయితే విజయశాంతి ని కేంద్రంగా చేసుకుని ఇటీవల తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శలు గుప్పించారు. ఆమె వల్ల బీజేపీకి ఎటువంటి ప్రయోజనం ఉండదని, ఆమె ఒక కాలం చెల్లిన నేత అని ఆయన సీరియస్ వ్యాఖ్యలు చేశారు. అయితే, తలసాని వ్యాఖ్యలపై విజయశాంతి స్పందించారు, తలసాని కి దీటుగా కౌంటర్ ఇచ్చారు.

విజయశాంతి ఒక కాలం చెల్లిన నేత అని తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై, విజయశాంతి స్పందిస్తూ, ఆ మాట కొంత వరకు నిజమే నని, నిజమైన తెలంగాణవాదులకు, తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారులకు ప్రస్తుత పరిస్థితులు కాలం చెల్లినట్లు గానే కనిపిస్తున్నాయని, తెలంగాణ ద్రోహులకు, తెలంగాణ వ్యతిరేకులకు మాత్రమే టీఆర్ఎస్ ప్రభుత్వంలో పరిస్థితులు బాగున్నాయని వాళ్లదే ప్రస్తుత కాలం అని చురకలు అంటించారు.

గతంలో తెలంగాణ ఉద్యమం నడిచినప్పుడు తలసాని శ్రీనివాస్ పూర్తిగా సమైక్యాంధ్ర స్టాండ్ తీసుకున్న సంగతి తెలిసిందే. తెలంగాణ ఉద్యమం జరిగినన్నాళ్ళు మాత్రమే కాకుండా, 2014లో తెలంగాణ ఏర్పాటు అయ్యే నాటికి కూడా తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా తలసాని శ్రీనివాస్ ఎప్పుడు మాట్లాడని విషయం కూడా తెలిసిందే. అప్పట్లో ఆయన టిడిపిలో ఉండడం వల్ల చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతాన్ని వల్లెవేయడం చేసేవారు. అదీగాక తన నియోజకవర్గంలో సీమాంధ్రుల వాట ఎక్కువగా ఉండడం వల్ల కూడా ఆయన పూర్తిగా తెలంగాణ వైఖరి ఏనాడు తీసుకోలేకపోయారు. అదే సమయంలో విజయశాంతి మాత్రం మొదటి నుండి కూడా తెలంగాణ అనుకూల వైఖరి తోనే ఉన్నారు. దీనివల్ల సీమాంధ్రలోని ప్రజల నుండి ఆమె పట్ల వ్యతిరేకత వచ్చినప్పటికీ కూడా ఆమె తెలంగాణ కి అనుకూలంగా మాట్లాడుతూ, తల్లి తెలంగాణా పార్టీని పెట్టి ఆ తర్వాత ఆ పార్టీ ని టీఆర్ఎస్ లో విలీనం చేశారు. అయితే ప్రస్తుతం తలసాని శ్రీనివాస్ తెలంగాణకు మంత్రి గా ఉంటే విజయశాంతి రాజకీయ భవితవ్యం ఇప్పటికీ అటు ఇటు గానే ఉంది. దీంతో తెలంగాణ ఉద్యమ ద్రోహులకు కాలం బాగుంది కానీ తెలంగాణవాదులకు , ఉద్యమకారులకు నిజంగానే కాలం చెల్లింది అంటూ ఆవిడ తలసానికి చురకలు అంటించడం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీఆర్ఎస్ఎల్పీ విలీనం లేనట్లే – రేవంత్ ఆకర్ష్ ఫెయిల్ !

బీఆర్ఎస్ఎల్పీని విలీనం చేసుకుంటామని ఇరవై ఐదు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని చేస్తున్న ప్రచారం అంతా డొల్గా తేలుతోంది. ముందుకు వచ్చిన ఒక్కో ఎమ్మెల్యేకు కండువా కప్పుతున్నారు...

రోజా దాచిన మద్యం డంప్ పట్టించిన సొంత పార్టీ నేతలు

ఏపీలో మద్యం దుకాణాలను గుప్పిట్లో పెట్టుకుని వైసీపీ నేతలు చాలా మందుగానే అన్ని నియోజకవర్గాలకు మద్యాన్ని సరఫరా చేసి పెట్టుకున్నారు. అది అధికారిక మధ్యమా.. పన్ను కట్టని మద్యమా అన్నదానిపై ఇంకా క్లారిటీ...
video

‘మ‌న‌మే’ టీజ‌ర్‌: క్యారెక్ట‌ర్ల మ‌ధ్య క్లాషు!

https://www.youtube.com/watch?v=_4Ff1zVtKkw శర్వానంద్ - శ్రీ‌రామ్ ఆదిత్య కాంబినేష‌న్‌లో 'మ‌న‌మే' రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. కృతి శెట్టి క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ రూపొందిస్తోంది. శ్రీ‌రామ్ ఆదిత్య త‌న‌యుడు ఈ చిత్రంలో...

‘కాంతార 2’లో మోహ‌న్ లాల్‌?

దేశాన్ని కుదిపేసిన క‌న్న‌డ చిత్రం 'కాంతార‌'. ఏమాత్రం అంచ‌నాలు లేకుండా, ఏమాత్రం ప్ర‌మోష‌న్లు చేయ‌కుండానే పాన్ ఇండియా స్థాయిలో విజ‌య ఢంకా మోగించింది. క‌న్న‌డ చిత్ర‌సీమ స్థాయిని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసింది. ఇప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close