విశాఖలో ఏకగ్రీవాలకు విజయసాయిరెడ్డి స్కెచ్..!

ఎవరైనా గ్రామాల్లో ఎంపీటీసీలకు, సర్పంచ్ స్థానాలకు ఏకగ్రీవాలు చేయిస్తారు కానీ తాను మాత్రం విశాఖలో కార్పొరేషన్ స్థానాలకు ఏకగ్రీవాలు చేయిస్తానని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సవాల్ విసురుతున్నారు. వైసీపీ ఉత్తరాంధ్ర బాధ్యతలు తీసుకున్న ఆయన ఇప్పుడు విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీని గెలిపించడమే లక్ష్యంగా పెట్టుకుని పని చేస్తున్నారు. ఇతర పార్టీల నేతల్ని సామ, బేద , దాన, దండోపాయాలు ప్రయోగించి పార్టీలోకి ఆకర్షిస్తున్నారు. ఇప్పటికే నాలుగు డివిజన్ల టీడీపీ నేతల్ని పార్టీలో చేర్చుకున్నారు. ఇందులో ఒకరు పార్టీ అభ్యర్థి కూడా. ఈ ఉత్సాహంలో ఆయన బీభత్సమైన స్టేట్‌మెంట్లు ఇస్తున్నారు. ఎన్నికలు జరిగేలోపు..విశాఖలో మెజార్టీ కార్పొరేషన్లు ఏకగ్రీవాలు అవుతాయన్నట్లుగా ధీమా వ్యక్తం చేస్తున్నారు. మీరే చూస్తారంటూ మీడియాకు హింట్ ఇస్తున్నారు.

విశాఖ విషయాన్ని విజయసాయిరెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా ప్రకటించిన తర్వాత… స్వీప్ చేయాల్సిన బాధ్యతను జగన్ ఆయనకే ఇచ్చారు. అయితే పరిస్థితులు అంత గొప్పగా లేవు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం.. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కన్నా ఎక్కువగా సెంటిమెంట్ గా మారింది. అదే సమయంలో విశాఖ పట్నం సిటీలో టీడీపీ బలంగా ఉంది. నాలుగు అసెంబ్లీ స్థానాల్లోనూ టీడీపీ అభ్యర్థులే గెలిచారు. అందులో ఒకర్ని వైసీపీలోకి లాక్కో గలిగినా క్యాడర్ ఎంత వరకూ వెళ్తారనేది సందేహాస్పదంగా మారింది. అందుకే విజయసాయిరెడ్డి ఏకగ్రీవాల సేఫ్ గేమ్ ప్రారంభించినట్లుగా భావిస్తున్నారు.

ఎన్నికలు జరగడం కన్నా.. ఏకగ్రీవాల ద్వారానే ఎక్కువ సీట్లు వైసీపీ ఖాతాలో వేయాలన్న లక్ష్యంతో విజయసాయిరెడ్డి ఉన్నట్లుగా కనిపిస్తోంది. కనీసం ఇరవై కార్పొరేటర్ స్థానాలు అయినా ఏకగ్రీవాలు చేయగలిగితే.. మేయరం పీఠం పొందడం సులభం అవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన తనదైన రాజకీయం చేస్తున్నట్లుగా చెబుతున్నారు. టీడీపీ అభ్యర్థులపై గురి పెట్టి.. ఇప్పటికే కొంత మందితో డీల్ సెట్ చేసుకున్నారని.. ఉపసంహరణ పత్రాలు తీసుకున్నారని అంటున్నారు. అందుకే .. ఆ ధీమాతోనే.. ఎన్ని ఏకగ్రీవాలు అవుతాయో చూస్తారని అంటున్నారని విశ్లేషిస్తున్నారు.

విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా చేయడంలో విజయసాయిరెడ్డి పాత్ర కీలకమని వైసీపీలో ప్రచారం జరుగుతోంది. అందుకే ఆయనకు స్పెషల్ ఇంట్రెస్ట్స్ ఉన్నాయని కూడా అటున్నారు.ఇప్పుడు విశాఖలో పట్టు నిలుపుకోకపోతే.. హైకమాండ్ వద్ద ఆయన పరపతి పడిపోయే ప్రమాదం ఉంది. అందుకే.. పాదయాత్రలతో పాటు… మొత్తం బాధ్యత తనపై వేసుకుని పని చేస్తున్నా

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

రేవంత్ రెడ్డి యార్క‌ర్… ప్ర‌తిప‌క్షాలు క్లీన్ బౌల్డ్ అయిన‌ట్లేనా?

గ‌త కొంత‌కాలంగా బీఆర్ఎస్ రైతుల చుట్టూ రాజకీయం మొద‌లుపెట్టింది. పంట ఎండిపోతుంద‌ని, సాగుకు విద్యుత్ అంద‌టం లేద‌ని, ధాన్యం కొనుగోలు ఏమైంద‌ని, రుణమాఫీపై మౌనం ఎందుకు అంటూ నేత‌లంతా మూకుమ్మ‌డిగా రేవంత్ స‌ర్కారుపై...

‘మై డియర్ దొంగ’ రివ్యూ: స‌హ‌నం దొంగిలించేశాడు

అభినవ్ గోమఠం అంటే నవ్విస్తాడనే నమ్మకం ఏర్పడింది. ఒకవైపు క్యారెక్టర్ రోల్స్ చేస్తూనే మెయిన్ లీడ్ గా కూడా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పుడాయన టైటిల్ రోల్ లో 'మై డియర్ దొంగ' సినిమా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close