విజయసాయిరెడ్డి ఇంత సైలెంట్ అయిపోయారేంటి !?

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇటీవలి కాలంలో పెద్దగా బయట కనిపించడం లేదు. అలాగని ఆయన ఆజ్ఞాతంలో లేరు. కొన్ని కార్యక్రమాల్లో కనిపిస్తున్నారు. కానీ గతంలో మాదిరిగా ఇష్టం వచ్చినట్లుగా ట్వీట్లు వేయడం లేదు.. వైసీపీ కార్యక్రమాల్లోనూ అంత చురుకుగా కనిపించడం లేదు. ఇంకా చెప్పాలంటే అసలు తాడేపల్లిలో కానీ పార్టీ కార్యాలయాల్లో కానీ ఆయన కనిపించడం అరుదుగా మారింది. దీంతో అసలు ఏం జరిగిందన్న చర్చ వైసీపీలో జోరుగా చర్చ నడుస్తోంది.

విజయసాయిరెడ్డి ఇటీవల రాజకీయ అంశాలపై పెద్దగా స్పందించడం లేదు. ఢిల్లీలో పార్లమెంటరీ పార్టీ సమావేశాలకు హాజరయ్యారు. బెంగళూరులో తన బంధువు అయిన తారకరత్నను పరామర్శించారు. ఇతర విషయాల్లో జోక్యం చేసుకోవడం లేదు. ఆయనకు పార్టీలో ప్రాధాన్యం పూర్తి స్థాయిలో తగ్గించారని ఇప్పటికే సంకేతాలు వచ్చాయి. సజ్జల రామకృష్ణారెడ్డి పూర్తిగా పార్టీని అదుపులోకి తీసుకున్నారు. చివరికి గత ఎన్నికల సమయంలో సోషల్ మీడియాను ఫేక్ ప్రచారాలతో హోరెత్తించడంలో కీలక పాత్ర పోషించిన విజయసాయిరెడ్డికి ఇప్పుడు ఆ బాధ్యతలూ లేకుండా చేశారు . సజ్జల కుమారుడు సోషల్ మీడియాను చూస్తున్నారు

చివరికి తాడేపల్లి ప్యాలెస్ లోనూ ఆయనకు అనుమతి లభించడం లేదని చెబుతున్నారు. ఈ పరిణామాలకు తోడు ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంలో శరత్ చంద్రారెడ్డి అరెస్ట్ వ్యవహారంతో ఆయన కుటుంబంలో కూడా ఆయనపై వ్యతిరేకత ఏర్పడిందని చెబుతున్నారు. కారణం ఏదైనా ఇప్పుడు విజయసాయిరెడ్డి ఒంటరిగా మారిపోయారని మాత్రం వైసీపీలో ఓ క్లారిటీ వచ్చినట్లయిందంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close