కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్: కిడ్నాప్ అని అనుమానం

హైదరాబాద్: విశాఖపట్నంలో డ్రైనేజ్ కాల్వలో పడి గల్లంతయిన ఆరేళ్ళ పాప అదితి ఆచూకీ ఐదురోజులైనా ఇంకా దొరకలేదు. ప్రభుత్వం డ్రైనేజ్‌ కాల్వల్లో, సముద్రంలో తీవ్రంగా గాలిస్తున్నా ఇంతవరకు ప్రయోజనం శూన్యం. సముద్రంలో పది బోట్లలో 50మంది జాలర్లు, డ్రైనేజిలో వందమంది మనుషులు, రిషికొండనుంచి ఆర్‌కే బీచ్ వరకు నేవీ హెలికాప్టర్, ఇవి కాకుండా పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, మెరైన్ దళాలు గాలింపు చర్యలలో నిమగ్నమయ్యారు. మరోవైపు ఇంతమంది వెతుకుతున్నా ఎక్కడా జాడ దొరకకపోవటంతో కొత్త అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమ పాపను ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారేమోనని తండ్రి, బంధువులు అనుమానాలు వ్యక్తం చేశారు. అదితి డ్రైనేజ్‌లో పడిపోవటం ప్రత్యక్షంగా చూసిన సాక్షులు లేరు. ఘటనాస్థలంలో స్థానికులను విచారణ చేయగా ఎవరూ చూడలేదని చెప్పటంతో అనుమానాలు బలపడుతున్నాయి. ట్యూషన్‌నుంచి అదితిని ఇంటికి తీసుకురావటానికి వెళ్ళిన కారు డ్రైవర్ గుర్నాథాన్నికూడా విచారించారు. డ్రైవర్ కూతురుకూడా అక్కడే ట్యూషన్ చదువుతోంది. మరోవైపు పోలీసులు ఈ వ్యవహారాన్ని మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్నారు. అదితి తల్లిదండ్రులు బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు చేస్తుండగా పాప విశాఖలో తాతయ్య దగ్గర ఉంటోంది. విశాఖలో డ్రైనేజి వ్యవస్థ నిర్వహణపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాయలసీమపైనే షర్మిల గురి !

కాంగ్రెస్ పార్టీ బలాన్ని రాయలసీమలో బలంగా చూపించేలా షర్మిల ప్రయత్నం చేస్తున్నారు. విస్తృత పర్యటనలు చేస్తున్నారు. కడప పార్లమెంట్ నియోజవకర్గం మొత్తం ఓ సారి సంచలనం రేపారు. వైఎస్ వివేకా హత్య...

‘సైరెన్’ రివ్యూ: థ్రిల్ తక్కువ… డ్రామా ఎక్కువ

ఎమోషనల్ డ్రామా టచ్ తో క్రైమ్ థ్రిల్లర్స్ రావడం అరుదే. జయం రవి, కీర్తి సురేశ్‌ కీలకపాత్రల్లో నటించిన ‘సైరెన్‌’ ఇలాంటి ట్రీట్మెంట్ తోనే తయారైయింది. చేయని తప్పుకు శిక్షని అనుభవించిన వ్యక్తి...

ధోనీ… ఆ మెరుపులు మ‌ళ్లీ!

కెరీర్ తొలి రోజుల్లో ధోనీ చాలా ధాటిగా ఆడేవాడు. త‌ను ఆడిన తుపాను ఇన్నింగ్సులు ఎన్నో. ఆ దూకుడు చూసే అత‌న్ని అభిమానించ‌డం మొద‌లెట్టారు. సీనియారిటీ పెరిగేకొద్దీ, త‌న వికెట్ ఎంత విలువైన‌దో...

బస్సు యాత్రలో కేసీఆర్‌కు ఎదురయ్యే మొదటి ప్రశ్న : ఇప్పుడు గుర్తొచ్చామా ?

కేసీఆర్ బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నారు. అది ఎన్నికల ప్రచారమే. కానీ అలా చెప్పడానికి కూడా కేసీఆర్ కు.. బీఆర్ఎస్ కు ధైర్యం లేదు. ప్రజల కోసమే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close