ఆ కేసు ఏపీ ప్రయోజనాలకి కూడా నష్టం కలిగిస్తోందా?

తెలంగాణా ప్రభుత్వం సుమారు రూ. 27,000 కోట్లతో చేపట్టబోతున్న పలమనేరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణానికి ఒకటి రెండు రోజుల్లో టెండర్లు పిలువబోతోంది. దానిని నిర్మిస్తే కృష్ణా జిల్లాలో రైతులు, పెన్నా డెల్టాలోని వ్యవసాయం దెబ్బ తింటుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనిపై ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకుండా ఊరుకొన్నారని రఘువీరా రెడ్డి ఆరోపిస్తున్నారు. ఇకనయినా మేల్కొని తక్షణమే కృష్ణానది జల మండలికి, జాతీయ జల మండలికి అలాగే ప్రధాని నరేంద్ర మోడికి లేఖలు వ్రాసి, తెలంగాణా ప్రభుత్వం చేపడుతున్న ఈ ఎత్తిపోతల ప్రాజెక్టును అడ్డుకొనే ప్రయత్నం చేయాలని కోరుతున్నారు. దీనిపై ఇప్పటికే రఘువీరా రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ నేతలు గవర్నర్ నరసింహన్ని కలిసి ఒక వినతి పత్రం ఇచ్చేరు. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఒక లేఖ వ్రాసారు.

“ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓటుకి నోటు కేసులో ఇరుకొన్నందునే ఈ ప్రాజెక్టుపై తెలంగాణా ప్రభుత్వం ముందుకు సాగుతున్నప్పటికీ మౌనం వహిస్తున్నారు. తనను తాను కాపాడుకొనేందుకు రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారు. అది సరి కాదు. తక్షణమే దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేసి ఈ ప్రాజెక్టు నిర్మాణం జరగకుండా అడ్డుకోవాలి,” అని రఘువీరా రెడ్డి డిమాండ్ చేసారు.

రఘువీరా రెడ్డి లేవనెత్తిన ఈ సమస్య, ఓటుకి నోటు కేసు ప్రభావం రాష్ట్ర ప్రయోజనాలకు కూడా హానికరంగా మారిందని స్పష్టం చేస్తోంది. కారణాలు ఏవయినప్పటికీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు తెలంగాణా రాజకీయాలలో జోక్యం చేసుకోవడం లేదు. అలాగే అక్కడ తన పార్టీని కూడా వదులుకొనేందుకు సిద్దపడినట్లే ఉన్నారు. అది ఆయన పార్టీకి మాత్రమే సంబంధించిన విషయం గాబట్టి ప్రజలు పట్టించుకోనవసరం లేదు. కానీ ఈ కేసు కారణంగా రాష్ట్ర ప్రయోజనాలను కూడా ప్రభుత్వం పణంగా పెట్టేందుకు సిద్దపడితే ప్రజలు, ప్రతిపక్షాలు కూడా ప్రశ్నించకమానరు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close