రాష్ట్రపతి ఎన్నికల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది?

రాష్ట్రపతి ఎన్నికల తర్వాత ఏం జరుగుతుంది ? ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఇదో హాట్ టాపిక్ అయింది. కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కేవలం రాష్ట్రపతి ఎన్నికల కోసమే ఆగిందన్న అభిప్రాయం వచ్చేలా కొంత మంది విశ్లేషణలు చేస్తున్నారు. అది అయిపోయిన తరవాత పంజా విసురుతుందని చెబుతున్నారు. నిజానికి రాష్ట్రపతి ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల అధికార పార్టీలు భిన్నమైన మార్గంలో వెళ్తున్నాయి. ఏపీ నుంచి దాదాపుగా అన్ని పార్టీలు బీజేపీ, ఎన్డీఏ అభ్యర్తి ద్రౌపది ముర్ముకు మద్దతు ప్రకటించాయి. తెలంగాణలో మాత్రం టీఆర్ఎస్ యశ్వంత్ సిన్హాకు మద్దతు ప్రకటించింది.

తెలంగాణలో అధికార పార్టీ బీజేపీతో ఢీ అంటే ఢీ అంటుంది. పైగా ఎన్నికల మూడ్ వచ్చేసింది. ఇప్పుడు బీజేపీ అక్కడ పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాల్సి ఉంటుంది. చేరికలతో పార్టీని బలోపేతం చేసుకోవాల్సి ఉంది. ఇప్పటికే టీఆర్ఎస్ నేతల చిట్టా అంతా దగ్గర పెట్టుకుని ఇక దర్యాప్తు సంస్థలతో విరుచుకుపడటమే మిగిలిందన్న ప్రచారం జరుగుతోంది. రాష్ట్రపతి ఎన్నికల వరకూ డిస్ట్రబెన్స్ ఎందుకని ఆగిందని చెబుతున్నారు. టీఆర్ఎస్ నేతలు కూడా ఈ ప్రచారాన్ని నమ్ముతున్నారు . రాష్ట్రపతి ఎన్నికలపై తమ పార్టీపై బీజేపీ గురి పెడుతుందని భావిస్తున్నారు.

అయితే విచిత్రంగా ఏపీలోనూ అలాంటి ప్రచారమే జరుగుతోంది. పూర్తి స్థాయిలో బీజేపీకి మద్దతుగా ఉంటున్న వైసీపీ విషయంలో బీజేపీ ఎందుకు కఠినంగా ఉంటుందన్న చర్చ అందుకే జరుగుతోంది. ఏపీ ప్రభుత్వానికి అండగా ఉంటే తమకే నష్టమని కేంద్ర బీజేపీ వర్గాలు అంచనాకు వచ్చాయంటున్నారు. దిగజారిపోయిన ఆర్థిక పరిస్థితితో పాటు దారుణంగా ఉన్న రాజ్యాంగ ఉల్లంఘనల కారణంగా మద్దతుగా ఉండటం కన్నా నిబంధనల ప్రకారం ఉంటే ఏ ఇబ్బంది ఉండదని భావిస్తున్నారు. కేంద్రం రూల్స్ ప్రకారం వ్యవహరించినా అది ఏపీ సర్కార్‌కు శిక్షలాంటిదే అనుకోవచ్చంటున్నారు.

అయితే బీజేపీ ఏదైనా చేయాలనుకుంటే రాష్ట్రపతి ఎన్నికల్లాంటి ముహుర్తాలు పెట్టుకోదని అనేక ఘటనలు రుజువు చేస్తున్నాయి.అంత దాకా ఎందుకు రాష్ట్రపతి ఎన్నికల్లో ముర్ముకే మద్దతు ప్రకటించిన జేఎంఎం పార్టీపై ఈడీ దాడులు జరుగుతున్నాయి. నేరుగా సీఎం ఇంట్లోనే సోదాలు చేస్తున్నారు. అందుకే… బీజేపీ ఏదైనా చేయాలనుకుంటే చేస్తుందని.. రాష్ట్రపతి ఎన్నికల్లాంటి ముహుర్తాలు పెట్టుకోదని వాదిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

ఇదేం స్ట్రాటజీ ఐ ప్యాక్ – గ్రాఫ్ పెరుగుతోందంటే ఆల్రెడీ తగ్గిపోయిందనే కదా అర్థం !

జగన్ మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరుగుతోందని ప్రచారం చేయాలి . మీకు ఎంత కావాలి ?. ఇది ఐ ప్యాక్ నుంచి వివిధ మీడియా సంస్థలకు.. సోషల్ మీడియా ఖాతాలకు .....

HOT NEWS

css.php
[X] Close
[X] Close