తెలంగాణ ఎమ్మెల్సీ పదవుల భర్తీ ఎప్పుడో !?

ప్రత్యక్ష ఎన్నిక అయిన హుజారాబాద్‌కు కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. మరి పెండింగ్‌లో పడిపోయిన ఎమ్మెల్సీ ఎన్నికలెప్పుడు అని టీఆర్ఎస్ నేతలు కిందా మీదా పడుతున్నారు. శాసనమండలికి శాసనసభ్యుల కోటా నుంచి ఎన్నికైన ఆరుగురు సభ్యుల పదవీకాలం ఈ ఏడాది జూన్ 3వ తేదీతో ముగిసింది. గవర్నర్ కోటా నుంచి ఒకరి పదవీకాలం పూర్తైంది. వీరంతా అధికార పార్టీకి చెందిన సభ్యులే. అయితే కరోనా కారణంగా ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లుగా ఈసీ ప్రకటించింది. ఇటీవల ఎన్నికలు ఇప్పుడే వద్దని తెలంగాణ సర్కార్ ఈసీకి కూడాలేఖ రాసింది. ఈ క్రమంలో ఎన్నికలు వాయిదా పడ్డాయి.

ఇప్పుడు హుజురాబాద్ ఎన్నికలు నిర్వహిస్తూండటంతో ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా పెడతారని భావిస్తున్నారు. ఈ క్రమంలో ఆశావహులు తమ ప్రయత్నాలు మళ్లీ ప్రారంభించారు. ఇదిలా ఉంటే గవర్నర్ కోటా ఎమ్మె్ల్సీ స్థానానికి ప్రభుత్వం పాడి కౌశిక్ రెడ్డి పేరును ఖరారు చేసి గవర్నర్‌కు పంపింది. ప్రస్తుతం ఆ ఫైల్ గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉంది. కేసీఆర్ పట్టుబడతారా లేకపోతే.. కౌశిక్ రెడ్డికి షాక్ ఇస్తారా అన్నది వేచి ఆసక్తికరంగా మారింది.

ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు పోటీ భారీగా ఉంది. సీఎం పలు జిల్లాలకు చెందిన నేతలకు ఎన్నికల సమయంలో పదుల సంఖ్యలో మంచి పదవి ఇస్తానని చెప్పడంతో వారు కూడా ఆశతో ఎదురు చూస్తున్నారు. పదువుల కోసం ఆశావాహులు ముమ్మర ప్రయత్నం చేస్తున్నారు స్థానిక సంస్థల కోటా నుంచి ఎన్నికైన 14 మందిలో 12 మంది పదవీకాలంలో వచ్చే ఏడాది జనవరి 4న ముగియనుంది. అప్పుడు మరికొంత మందికి అవకాశాలు ఇస్తామని కొంత మందిని బుజ్జగించే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏబీపీ సీఓటర్ సర్వే : బీఆర్ఎస్‌కు ఒక్కటే !

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి మంచి జోరు మీద ఉన్న కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికల్లో గట్టి పోటీ ఎదురయినప్పటికీ పది వరకూ లోక్ సభ సీట్లను గెల్చుకునే అవకాశం...

ఏబీపీ సీఓటర్ సర్వే : టీడీపీ కూటమికి 20, వైసీపీకి 5 లోక్‌సభ సీట్లు

ఎన్డీఏ కూటమి బలం రోజు రోజుకు పెరుగుతోంది. వైసీపీపై వ్యతిరేకత అంతకంతకూ పెరుగుతోందని సర్వేల వెల్లడిస్తున్నయి. అత్యంత ఖచ్చితంగా సర్వేలు, ఒపీనియన్ పోల్స్ వెల్లడిస్తుందని పేరున్న ఏబీపీ- సీఓటర్ ఎన్నికలకు ముందు నిర్వహించిన...

సునీత సాక్ష్యాలకు పాత ఆరోపణలే అవినాష్ రెడ్డి కౌంటర్ !

వివేకా హత్య కేసులో సునీత జస్టిస్ ఫర్ వివేకా పేరుతో పెడుతున్న ప్రెస్ మీట్లు వెల్లడిస్తున్న సంచనల విషయాలతో అవినాష్ రెడ్డికి మైండ్ బ్లాంక్ అవుతోంది. స్పందించకపోతే నిజం అని...

రాయి కేసు : లీకులిచ్చి జగన్ పరువు తీసిన పోలీసులు !

అనవసర డ్రామాలతో భద్రతా వైఫల్యమని పోలీసుల్ని చేతకాని వాళ్లుగా చేస్తున్నారని కోపం వచ్చిందేమో కానీ విజయవాడ పోలీసులు వైసీపీతో పాటు జగన్ పరువు తీసే లీకులు మీడియాకు ఇచ్చారు. జగన్ పై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close