“ముంచే” సలహాలు కేసీఆర్‌కు ఇస్తున్న అధికారులెవరు..!?

తెలంగాణ సీఎం కేసీఆర్ రాజకీయంగా సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నా. .. రాజకీయ చాణక్యం ద్వారా వాటిని ఆయన చక్కబెట్టుకోగలరు. కానీ.. పాలనలో ఎదుర్కొంటున్న సవాళ్లు మాత్రం.. ఆయనకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. ముఖ్యంగా రిజిస్ట్రేషన్లు నిలిపివేత, ధరణి విధానం అలాగే.. ఎల్‌ఆర్ఎస్‌తో కేసీఆర్ ప్రజల వైపు అనే ఇమేజ్ మసకబారే ప్రమాదం ఏర్పడింది. ఈ మూడు కూడా ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. ఆర్థిక భారాన్ని కల్పిస్తున్నాయి. కేసీఆర్ ప్రజలను దోచుకోవడానికే ఇవి తెచ్చారన్న అభిప్రాయమూ ప్రజల్లో బలపడుతోంది. దీంతో ఇప్పుడు టీఆర్ఎస్‌లో ఈ నిర్ణయాలకు కారణం ఎవరన్న చర్చ జరుగుతోంది.

ఏ ప్రభుత్వం .. సీఎం అధికారంలో ఉన్నా.. వారు.. కొంత మంది సీనియర్ అధికారులపై ఆధారపడాల్సిందే. సీఎం ఆలోచనలకు అనుగుణంగా వారు పరిపాలనా నిర్ణయాలు అమలు చేయాల్సి ఉంటుంది. కొంత మంది పరిధి దాటి తమ ఆలోచనలు అమలు చేసేలా.. పాలకుల్ని ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం.. తెలంగాణలో కొంత మంది అధికారులు కేసీఆర్‌ కోటరీగా ఏర్పడి ఆయనకు సలహాలిస్తున్నారని ఆ ప్రకారమే ఆయన నిర్ణయాలు తీసుకుంటున్నారన్న చర్చ జరుగుతోంది. ధరణి అమల్లోకి తేవడం.. తక్షణం రిజిస్ట్రేషన్లు నిలిపివేయడం… అదే సమయంలోఎల్ఆర్ఎస్ తేవడం… ఓ అధికారి ఆలోచన అని చెబుతున్నారు. అలా చేస్తే.. భూసమస్యలు పరిష్కారమై ప్రజలు ఆనందంలో ఉంటారని.. ఎల్‌ఆర్ఎస్ కట్టడానికి వెనుకాడరని కేసీఆర్ ను ఒప్పించినట్లుగా చెబుతున్నారు.

కానీ ఆచరణలో పరిస్థితి తిరగబడింది. రిజిస్ట్రేషన్లు మూడు నెలల నుంచి లేవు. దీంతో అమ్మకాలు, కొనుగోళ్లు ఆగిపోయి ప్రజలు ఇబ్బందిపడ్డారు. ప్రభుత్వానికి ఆదాయం తగ్గిపోయింది. అదే సమయంలో.. కొత్త విధానం లేనిపోని సమస్యలు తెచ్చింది. న్యాయవివాదాల్లో చిక్కుకుంది. చివరికి పాత విధానంతోనే రిజిస్ట్రేషన్లు ప్రారంభించాల్సి ఉంది. ఇక ఇప్పుడు ఎల్ఆర్ఎస్ సమస్య అలాగే ఉంది. టీఆర్ఎస్ ఓడిస్తే ఎల్ఆర్ఎస్ రద్దవుతుందన్న ప్రచారాన్ని విపక్షాలు చేస్తున్నాయి. దాదాపుగా ఇరవై వేల కోట్ల ఆదాయాన్ని ప్రభుత్వం అంచనా వేస్తోందని.. ఎల్ఆర్ఎస్ ద్వారా ఖాళీ స్థలాలలను గుర్తించి పన్నులేస్తారని ఇలా రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. దీంతో పన్నులు బాదేస్తున్నారన్న అభిప్రాయమూ వినిపిస్తోంది.

మొత్తానికి కేసీఆర్ పాలనా పరంగా తీసుకున్న నిర్ణయాలు రివర్స్ అయినట్లయింది. ఇప్పుడు.. వాటినుంచి ఎలా బయటకు రావాలా అని టీఆర్ఎస్ పెద్దలు ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. విప్లవాత్మక నిర్ణయాలు తీసుకోకపోతే… తమపై వ్యతిరేకత మొత్తానికే పెరిగిపోతుందన్న ఆందోళనలో వారున్నట్లుగా చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఛోటా కె.నాయుడు Vs హ‌రీష్ శంక‌ర్‌… ఏం జ‌రిగింది?

'మ‌ళ్లీ నా జోలికొచ్చారో... చూసుకొందాం' అంటూ సినిమా ఫ‌క్కీలో కెమెరామెన్‌ ఛోటా కె.నాయుడుకు వార్నింగ్ ఇచ్చాడు హ‌రీష్ శంక‌ర్‌. వీరిద్ద‌రూ క‌లిసి 'రామ‌య్యా వ‌స్తావ‌య్యా' సినిమా చేశారు. అప్ప‌టి నుంచీ ఇద్ద‌రి మ‌ధ్యా...

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close