ఇంతకీ రాష్ట్రపతి ఎన్నికల్లో టీడీపీ మద్దతు ఎవరికి !?

దేశంలో రాష్ట్రపతి ఎన్నికలపై చర్చ జరుగుతోంది. కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం ఈ విషయంలో అసలు ఆసక్తి చూపించడం లేదు. తమ రాజకీయం తాము చేసుకుంటోంది. కాంగ్రెస్ కూటమి కానీ.. ప్రాంతీయ పార్టీల కూటమి కానీ టీడీపీ తమతో కలిసి వస్తుందని అనుకోవడం లేదు. అందుకే వారు కూడా భేటీలకు ఆహ్వానం పంపడం లేదు. అయితే టీడీపీ ఎవరికి మద్దతు ఇస్తుందనేది ఇప్పుడు కీలకంగా మారింది. తెలుగుదేశం పార్టీకి భారీగా ఓట్లు లేవు. చాలా కొద్దిగానే ఉన్నాయి. ముగ్గురు ఎంపీలు, ఇరవై మంది ఎమ్మెల్యేల ఓట్లతో సాధించేదేమీ ఉండదు. అయితే ఆ ఓట్లు కూడా కీలకమయ్యే అవకాశం ఉంది.

మమతా బెనర్జీ ప్రతిపక్షల మీటింగ్ పెట్టుకుని అందర్నీ పిలిచారు. జగన్, చంద్రబాబును మాత్రం పిలువలేదు. చంద్రబాబు జాతీయ రాజకీయాల విషయంలో అంటీ ముట్టనట్లుగా ఉన్నారు. అసలు ఆ వైపు చూడటం లేదు. బీజేపీకి ప్రత్యామ్నాయం అనే ఆలోచన కూడా చేయడం లేదు. ముందుగా రాష్ట్రంలో మళ్లీ అధికారం సాధించుకోవడమే లక్ష్యంగా ఆయన పని చేసుకుంటున్నారు. ముందు సీట్లు సాధిస్తే.. తరవాత ఢిల్లీ వ్యవహారాలు చూడాలనుకుంటున్నారు.

ఇప్పటికిప్పుడు చూస్తే.. తెలుగుదేశం పార్టీ కూడా ఎన్డీఏ అభ్యర్తికే మద్దతిచ్చే అవకాశాలే ఎకకువగా కనిపిస్తున్నాయి. కొద్దిగా ఓట్లు అయినా.. బీజేపీకి ఆ కొద్దిగానే తగ్గాయి. బీజేపీ ఎవరిని ఎంపిక చేసినా.. సామాజికవర్గ కారణమో.. మరొకటో చెప్పి.. ఆ పార్టీ అభ్యర్థికే ఓట్లు వేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఎలాంటి రిస్క్ రాజకీయాలు ప్రస్తుతం చేసే చాన్స్ లేదని.. రాష్ట్రంలో గెలుపుపైనే తమ దృష్టి అని.. ఇప్పటికే చాలా సార్లు చంద్రబాబు పార్టీ నేతలకు సందేశం పంపారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close