ఇంతకీ హర్యానా సీఎంను ఏపీ సీఎం ఎందుకు కలిసినట్లు !?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్‌తో సమావేశం అయ్యారు. వీరి మధ్య భేటీ దాదాపుగా రెండు గంటల పాటు సాగింది. హర్యానా సీఎంతో సమావేశం కోసమే ప్రత్యేకంగా జగన్ తాడేపల్లి నుంచి విశాఖ వచ్చారు. బేపార్క్‌లో హర్యానా సీఎం నేచురోపతి ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. మనోహర్ లాల్ ఖట్టర్ బీజేపీ పాలిత రాష్ట్రం హర్యానాకు సీఎం. ఆయన బీజేపీ తరపున ఏమైనా చర్చలు జరిపి ఉంటారా అన్న సందే్హం రాజకీయవర్గాల్లో కలుగుతోంది. త్వరలో రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి.

తమ అభ్యర్థిని ఏకగ్రీవంగా గెలిపించుకోవడానికి అవసరమైన మెజార్టీ భారతీయ జనతా పార్టీకి.. ఎన్డీఏకు లేదు. ఖచ్చితంగా ఇతర పార్టీల మద్దతు తీసుకోవాల్సిందే. వైఎస్ఆర్‌సీపీకి అంటు ఎంపీల పరంగా.. ఇటు ఎమ్మెల్యేల పరంగా కూడా గణనీయమైన ఓట్లు ఉన్నాయి. వైఎస్ఆర్‌సీపీ మద్దతిస్తే బీజేపీ పని సులువు అవుతుంది . ఈ అంశంపై ఖట్టర్ చర్చించి ఉండవచ్చని భావిస్తున్నారు. హర్యeనా అసెంబ్లీకి ఈ ఏడాది చివరిలో ఎన్నికలు జరగనున్నాయి. ఆ అంశాలమైనా చర్చించారా అన్న చర్చలు ఇవన్నీ కాకపోతే.. సీఎం జగన్మోహన్ రెడ్డికి అనేక కంపెనీలు ఉన్నాయి. వాటికి సంబంధించిన పెట్టుబడుల అంశం ఏమైనా చర్చించి ఉంటారని అంచనా వేస్తున్నారు.

ప్రభుత్వం అధికారికంగా చెబితే ఇలాంటి ఊహాగానాలకు తెరపడే అవకాశం ఉంది.కానీ సీఎంవో ఎలాంటి అధికారిక ప్రకటనా విడుదల చేయలేదు. ఏపీకి వచ్చిన హర్యానా సీఎంను జగన్ మర్యాదపూర్వకంగా మాత్రమే కలిశారని ఈ సమావేశానికి ప్రత్యేకమైన ఎజెండా ఏమీ లేదని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఊరకనే మర్యాద పూర్వకంగా జగన్ వెళ్లి కలుస్తారంటే ఎవరూ నమ్మలేకపోతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

యాక్సిడెంట్ కేసులో ర‌ఘుబాబు

సినీ న‌టుడు ర‌ఘుబాబు చిక్కుల్లో ప‌డ్డారు. ఆయ‌న‌పై ఓ యాక్సిడెంట్ కేసు న‌మోదైంది. హైద‌రాబాద్ నుంచి గుంటూరు కారులో వెళ్తున్న ర‌ఘుబాబు న‌ల్గొండ జిల్లా నార్క‌ట్ ప‌ల్లి - అద్దంకి ర‌హ‌దారి వ‌ద్ద...

బొండా ఉమ వైపే రాయి – వైసీపీ చీప్ ట్రిక్కులు !

రాయి రాజకీయాన్ని బొండా ఉమ వైపు తిప్పడానికి కుట్ర సిద్ధాంత నిపుణుడు సజ్జల రామకృష్ణారెడ్డి... పోలీసులతో కలిసి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. వడ్డెర బస్తీ పిల్లల్ని టార్గెట్ చేసిన తర్వాత...

నాటి టీడీపీ పరిస్థితే నేడు వైసీపీది !

2019 ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా జాతీయ సర్వేలు వచ్చాయి. ఆ సర్వేలన్నింటిలో.. వైసీపీ భారీ విజయం సాధించబోతోందని అంచనా వేశాయి. కానీ తెలుగుదేశం పార్టీ నేతలు అవన్నీ పెయిడ్...

వైసీపీని “చెత్త కుప్ప”ల్లోకి చేర్చిన అంబటి రాంబాబు !

ఎన్నికల ప్రచారం చేయాలంటే ఓ ఆలోచన ఉండాలి. కానీ ఆ ఆలోచన వింతగా ఉంటే మాత్రం రివర్స్ అవుతుంది. దానికి అంబటి రాంబాబే సాక్ష్యం. ఇప్పుడు సత్తెనపల్లిలో ఎక్కడ చూసినా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close