జగన్ తెలంగాణకొస్తే కేసీఆర్ రాళ్లతో కొట్టిస్తారు, ఆంధ్రుల మీద మాత్రం జగన్ ని రుద్దుతారు

జగన్ కేసీఆర్ ల మధ్య ఉన్న బంధం కేంద్రంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పలు విమర్శలు చేశారు. భీమవరంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభ లో కేసీఆర్, జగన్ లని తూర్పారబడుతూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు ప్రజల నుండి విపరీతమైన స్పందన వచ్చింది.

పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, “జగన్ తెలంగాణలో పోటీ చేద్దామని అనుకుంటే, తెలంగాణలో అడుగు పెడితే, ఇలాంటి ఫ్యాక్షనిస్టులు మాకొద్దంటూ, ఇలాంటి రౌడీ రాజకీయాలు మాకొద్దంటూ కేసీఆర్ గతంలో జగన్ ని రాళ్లతో కొట్టించాడు. కానీ అదే జగన్ ని ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ కి మాత్రం ముఖ్యమంత్రిని చేయాలని తెగ ప్రయత్నిస్తాడు. మీకు అక్కర్లేని జగన్ ను మా మీద మాత్రం ఎందుకు రుద్దుతారు” అంటూ విమర్శనాస్త్రాలు సంధించాడు. ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చేయాలనుకుంటే నేరుగా వచ్చి రాజకీయాలు చేయాలని, ఇక్కడి ఎమ్మెల్యే అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్ ని టీఆర్ఎస్ అభ్యర్థి అంటూ బహిరంగంగా ప్రకటించాలని పవన్ కళ్యాణ్ కేసీఆర్ కు సవాల్ విసిరారు.

అదే విధంగా కేసీఆర్ తో పెట్టుకుంటే తెలంగాణలో ఉన్న ఆస్తులకు భద్రత ఉండదని వస్తున్న వ్యాఖ్యల పై కూడా పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించాడు. తెలంగాణ ఏమి పాకిస్తాన్ లో లేదని, ఆస్తులు లాక్కోవాలని కేసీఆర్ అనుకుంటే దానికి తాను భయపడనని, తన ఆస్తులు లాక్కోవడానికి ప్రయత్నిస్తే ఎదురొడ్డి నిలబడతానని పవన్ కళ్యాణ్ అన్నారు.

ఏది ఏమైనా వైకాపా – కేసీఆర్ ల మధ్య ఉన్న బంధాన్ని హైలెట్ చేస్తూ, తమదైన శైలిలో విమర్శలు చేస్తూ పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగానికి భారీ స్పందన వచ్చింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

ట్రబుల్ షూటర్… ట్రబుల్ మేకర్ అవుతున్నారా?

14... ఇది లోక్ సభ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్. అందుకు తగ్గట్టుగానే ప్రచారం చేపడుతున్నారు. అభ్యర్థుల గెలుపు బాధ్యతను తనే తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు.ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close