లోకేష్ జూమ్‌ మీటింగ్‌లోకి చొరబడిన కొడాలి, వంశీ

పదో తరగతి ఫెయిలయిన విద్యార్థులతో నారా లోకేష్ జూమ్ మీటింగ్ పెట్టారు. వారితో మాట్లాడుతున్నారు. ప్రభుత్వం చదువులు సాగిన వైనం.. టీచర్ల కొరత ఇలాంటి అంశాలపై మాట్లాడుతున్నారు. వారికి ధైర్యం చెబుతున్నారు. అయితే హఠాత్తుగా ఇద్దరు విద్యార్థులను పక్కకు తప్పించి మీటింగ్‌లోకి్ కొడాలి నాని, వల్లభనేని వంశీ వచ్చారు. ఇద్దరు విద్యార్థినుల పేరుతో లాగిన్ అయ్యారు. అయితే వారికి జూమ్ మీటింగ్ జరుగుతుందో లేదో అర్థం కాలేదు. కొడాలి నాని …, విద్యార్థినిని పక్కకు పంపేసిన తాను సీట్లో కూర్చుని ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నారు కానీ.. ఏమీ అర్థం కాక మళ్లీ తీసేశారు.

వల్లభనేని వంశీ ఆఫీసు నుంచి ఓ విద్యార్థిని లాగిన్ అయింది.. ఆ విద్యార్థిని మాట్లాడుతూండగా.. ల్యాప్ ట్యాప్ తీసుకెళ్లి ఆయనకు ఇచ్చారు. ఆయన వెకిలి నవ్వులు నవ్వారు. వీరితో పాటు మరికొంత మంది వైసీపీ నేతలు కూడా జూమ్ కాల్‌లోకి చొరబడినట్లుగా తెలుస్తోంది. కొంతమంది వైసీపీ కార్పొరేటర్లు కూడా ఫెయిలయిన విద్యార్థుల పేర్లతో ఐడీ తీసుకుని తర్వాత ఎంట్రీ ఇచ్చారు. ఈ వ్యవహారం సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది. విద్యార్థులతో మాట్లాడుతూంటే.. మధ్యలో వీరు వచ్చి ఎం చేస్తారన్న ప్రశ్న వినిపిస్తోంది.

ఓ సమావేశంలో చొరబడటం మాత్రమే కాకుండా రాజకీయం చేయాలని చూడటంతో .. ఇదేం వెకిలి చేష్టలన్న అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తంది. ఇది టెన్త్ ఫెయిలయిన వాళ్ల కోసమేనని.. కానీ వాళు కూడా టెన్త్ ఫెయిల్ బ్యాచేనా అని కొంత మంది సెటైర్లు వేస్తున్నారు. మొత్తంగా నారా లోకేష్ ఏం చేస్తున్నారా అని టార్గెట్ పెట్టుకుని పూర్తి స్థాయిలో సమాచారం సేకరించి .. ఆయన వ్యవహారాల్ని డిస్టర్బ్ చేయడానికి వైఎస్ఆర్‌సీపీ పూర్తి స్థాయిలో ప్రయత్నిస్తోందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

“చెంగిచెర్ల” మీదుగా బీజేపీ ఎలక్షన్ ప్లాన్లు !

మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఘర్షణ జరిగింది. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని కోరారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close