ముద్రగడ ఇప్పుడు స్పందించడా?

చంద్రబాబు నాయుడు , 2014 మేనిఫెస్టోలో పెట్టిన కాపు రిజర్వేషన్ల అంశంపై ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. మోడీ ఇటీవల చట్టం గా మార్చిన ‘అగ్రవర్ణాల పేదలకు 10% రిజర్వేషన్’ ని ఆధారంగా చేసుకుని, ఆ 10% లో ఐదు శాతాన్ని కాపులకు కేటాయిస్తానని, మిగిలిన ఐదు శాతం రిజర్వేషన్లను అగ్రవర్ణాల లోని ఇతర పేదలందరికీ వర్తింప చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. అయితే కాపు రిజర్వేషన్ల అంశం పై పోరాడిన ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం ఇప్పటిదాకా ఈ అంశంపై స్పందించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

ముద్రగడ పద్మనాభం ఒకప్పుడు ఏ పార్టీలోకి వెళ్లినా ఆ పార్టీలో గెలిచిన రాజకీయ నాయకుడు. కానీ తర్వాత తర్వాత ఎన్నికల్లో ఓడిపోతూ వచ్చాడు. 2009లో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి వంగా గీత మీద పోటీ చేసినప్పుడు మూడవ స్థానంలో ఉన్నాడు. అయితే 2014లో కాపు రిజర్వేషన్ల అంశాన్ని మేనిఫెస్టోలో పెట్టి చంద్రబాబు నాయుడు గెలిచాక, తిరిగి కాపు రిజర్వేషన్ల కోసం పోరాటం మొదలుపెట్టి , కాపు ఉద్యమ నాయకుడిగా మారాడు. అయితే కాపు రిజర్వేషన్లు అనే అంశంపై సుధీర్ఘంగా పోరాడిన చరిత్ర ఉండడంతో కాపులు కూడా ముద్రగడ వెంట నడిచారు.

అయితే చంద్రబాబు నాయుడు ఇంత కీలకమైన ప్రకటన చేసిన సమయంలో ముద్రగడ పద్మనాభం దానిని ఆహ్వానిస్తూ కానీ, లేదంటే ఏమైనా అభ్యంతరాలు ఉంటే వాటిని వివరణ ఇస్తూ కానీ ఇప్పటివరకు స్పందించలేదు. దీని మీద భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. తెర వెనుక ముద్రగడ పద్మనాభం ని కూడా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించే ప్రయత్నాలు జరుగుతున్నాయని సోషల్ మీడియాలో రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఆ చర్చల కారణంగానే, ముద్రగడ పద్మనాభం ప్రస్తుతానికి స్పందించడం లేదని, చర్చలు పూర్తయ్యాక అవి సఫలం కావడం లేదా విఫలం కావడం అన్న అంశాన్ని బట్టి చంద్రబాబు నిర్ణయాన్ని స్వాగతించాలా లేదంటే విమర్శించాలా అన్నది ముద్రగడ నిర్ణయించుకుంటారని రూమర్లు వినిపిస్తున్నాయి.

ముద్రగడ ఎందుకు స్పందించడం లేదు అన్న సందేహాలకు తెర పడాలన్నా, ఈ రూమర్లకు తెర దించాలన్నా ముద్రగడ చంద్రబాబు నిర్ణయం పై స్పందించాల్సి ఉంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close