రాపాక పాటించరని తెలిసి మరీ పవన్ ఆదేశించడమెందుకు..?

మేూడు రాజధానుల బిల్లును అసెంబ్లీలో వ్యతిరేకించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావును ఆదేశించారు. విప్ జారీ చేయడం లాంటి అవకాశాలు..ఒకే ఒక్క ఎమ్మెల్యే ఉన్న జనసేనకు సాధ్యం కాదు. విప్ జారీ చేసినా.. అది రాపాకనే జారీ చేయాలి. కానీ.. అలాంటి పరిస్థితి లేకపోవడంతో.. పవన్ కల్యాణ్.. రాపాకకు ఆదేశాలు జారీ చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణకు మద్దతు ఇస్తున్నా.. పరిపాలనా వికేంద్రీకరణను వ్యతిరేకించాలని పవన్ స్పష్టం చేశారు. ఈ మేరకు రాపాకకు స్పష్టమైన సందేశం పంపారు. ఓ లేఖ విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. పరిపాలన వికేంద్రీకరణ చేసి.. అభివృద్ధితో రాష్ట్రాన్ని కొత్త పుంతలు తొక్కించాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు..మూడు రాజధానులపై కేబినెట్‌లో నిర్ణయం తీసుకుని.. అసెంబ్లీలో బిల్లు కూడా పెట్టారు.

అసెంబ్లీలో వైసీపీకి తిరుగులేని మెజార్టీ ఉంది. ప్రతిపక్షాలకు కనీస మెజార్టీ కూడా లేదు. జనసేనకు ఒకే ఎక్క ఎమ్మెల్యే ఉన్నారు. కానీ ఆయన జనసేన కంటే.. వైసీపీతోనే ఎక్కువ సన్నిహితంగా మెలుగుతున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా.. ఆయన గొప్పగా పొగుడుతున్నారు. జనసేన కార్యక్రమాలకు హాజరు కావడం లేదు. కొద్ది రోజుల కిందట.. పార్టీ విస్తృత స్థాయిసమావేశాలు జరుగుతున్నప్పటికీ.. ఆయన మంత్రి కొడాలి నానితో కలిసి కోళ్ల పందాల్లో పాల్గొన్నారు.

అధికారికంగా.., ఆయన జనసేన పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ.. వ్యవహారికంగా వైసీపీ ఎమ్మెల్యేగా మారిపోయారు. ఈ క్రమంలో.. ఆయనపై అనర్హతా వేటు కోసమో.. మరో విధంగా ఫిక్స్ చేయడానికి.. పవన్ కల్యాణ్.. ఈ లేఖ రాసినట్లుగా భావిస్తున్నారు. పార్టీ అధ్యక్షుడి హోదాలో పవన్ కల్యాణ్ లేఖలో కోరినట్లుగా రాపాక మూడు రాజధానుల బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయకపోతే.. ఆయనపై.. స్పీకర్‌కు ఫిర్యాదు చేయడం.. లేకపోతే కోర్టుకెళ్లడం.. చేయాలని.. జనసేన అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

ఇదేం స్ట్రాటజీ ఐ ప్యాక్ – గ్రాఫ్ పెరుగుతోందంటే ఆల్రెడీ తగ్గిపోయిందనే కదా అర్థం !

జగన్ మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరుగుతోందని ప్రచారం చేయాలి . మీకు ఎంత కావాలి ?. ఇది ఐ ప్యాక్ నుంచి వివిధ మీడియా సంస్థలకు.. సోషల్ మీడియా ఖాతాలకు .....

HOT NEWS

css.php
[X] Close
[X] Close