మోదీతో భేటీ తర్వాత డల్‌గా పవన్‌ – ఏం చెప్పినా స్పందన లేదనేనా ?

ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పవన్ కల్యాణ్ అరగంట పాటు సమావేశమయ్యారు. ప్రధాని హోదాలో ఉన్న మోదీతో అయితే ఇదే మొదటి భేటీ. 2014 ఎన్నికలకు ముందు అహ్మదాబాద్ వెళ్లి కలిశారు. తర్వాత ఎన్నికల ప్రచారంలో కలిశారు. ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక్క సారి కూడా కలవలేదు. పొత్తులో ఉన్న ఏ సమావేశానికీ పిలుపు రాలేదు. కానీ ఇప్పుడు మాత్రం పిలిచి మాట్లాడారు. అయితే పవన్‌లో అంత ఉత్సాహం కనిపించలేదు. అరగంట భేటీ తర్వాత ఆయన డల్‌గానే కనిపించారు. మామూలుగా తాను చెప్పిన వాటికి ప్రధాని వైపు నుంచి సానుకూల స్పందన వస్తేనే కాస్త ఉత్సాహం ఉంటుంది. అలాంటిదేం లేదన్న అభిప్రాయం పవన్ కల్యాణ్‌ను చూసిన వారికి వస్తోంది.

మోదీతో పవన్ ఏం చర్చించారన్నదానిపై ఇంకా అధికారికంగా ఎలాంటి స్పష్టత లేదు కానీ.. రాజకీయ పరిస్థితులపై ఆయన నివేదిక ఇవ్వడమే కాకుండా .. వాటి గురించి చెప్పే ప్రయత్నం చేశారని అంటున్నారు. వైసీపీ ప్రభుత్వ మూడున్నరేళ్ల పాలనలో దాడులు, దౌర్జన్యలు, రాష్ట్రం అథోగతి కావడం, కుంభకోణాలు, ప్రజల ఆస్తుల్ని దోచుకోవడం వంటి వాటన్నింటిపైనా వివరించారు. అదే విధంగా మూడు రాజధానుల పేరుతో రాష్ట్రంలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలిపినట్లుగా సమాచారం. అయితే పవన్ ఏం చెబుతున్నా.. మోదీ తనకు తెలుసని వ్యాఖ్యానించినట్లుగా చెబుతున్నారు. ఇంకా చెప్పాలని అడిగినా.. అన్నీ తనకు తెలుసన్నట్లుగా మాట్లాడటంతో పవన్ కు ఏం చెప్పాలో అర్థం కాలేదంటున్నారు.

అన్నీ తెలిసినప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదన్న అనుమానం పవన్ కల్యాణ్‌లో రావడం సహజం. ఏపీ పరిస్థితులపై ఏమీ తెలియకపోతే సరే.. అన్నీ తెలిసి కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఏమిటన్న అభిప్రాయం పవన్‌లో రావడం వల్లనే డల్ అయ్యారని అంటున్నారు. అయితే జనసైనికులు మాత్రం పవన్‌లో నిరాశ ఎక్కడా లేదని.. ఆయన తీరిక లేని కార్యక్రమాల్లో గడుపుతూ.. హఠాత్తుగా ప్రధాని మోదీ ఇచ్చిన అపాయింట్‌మెంట్ మేరకు వచ్చారని.. అది ప్రయాణబడలికే కానీ.. మోదీతో సమావేశం ఎఫెక్ట్ కాదంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

పరశురాం డబ్బులు వెనక్కి ఇస్తాడా ?

ఫ్యామిలీ స్టార్ నిరాశ పరిచింది. విజయ్ దేవరకొండ, పరసురాం సక్సెస్ కాంబినేషన్ లో మంచి అంచనాలతో వచ్చిన సినిమా అంచనాలని అందుకోలేకపోయింది. గీతగోవిందం మ్యాజిక్ మరోసారి వర్క్ అవుట్ అవుతుందని భావించారంతా. కానీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close