“ఆత్మహత్య” రాజకీయంలో షర్మిల ఫస్ట్ !

ఓదార్పు యాత్రలు చేసిన రాజకీయమో.. అంతకు మించిన వ్యూహమో కానీ తెలంగాణలో పార్టీ పెట్టుకున్న షర్మిల “ఆత్మహత్య”లు ఎక్కడ జరిగితే అక్కడ తక్షణం వాలిపోతున్నారు. అది నిరుద్యోగి ఆత్మహత్యనా.. లేకపోతే రైతు ఆత్మహత్యనా అన్నది తర్వాతి విషయం. ముందుగా చురుకుగా కదులుతున్నారు. అందరి కన్నా ముందుగా బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. తమకు మాత్రమే సాధ్యమయ్యే దీక్షలను అప్పటికప్పుడు చేస్తున్నారు. ఈ వేగం సంప్రదాయ తెలంగాణ రాజకీయ నేతలు అందుకోలేకపోతున్నారు.

ఇటీవల నిరుద్యోగుల ఆత్మహత్యలు తగ్గి.. రైతుల ఆత్మహత్యలు పెరిగాయి. వరి రైతులు కళ్లాల్లో చనిపోవడం.. పురుగు మందులు తాగడం వంటివి జరుగుతున్నాయి. తాజాగా మెదక్ జిల్లాలో రవికుమార్ అనే రైతు తన చావుకు కేసీఆర్ కారణం అన్నట్లుగాలేఖ రాసి ప్రాణాలు తీసుకున్నారు. ఆ వార్త అలా బయటకు రాగానే ఇలా షర్మిల వెంటనే మెదక్ జిల్లాలోని రవికుమార్ఇంటికి వెళ్లిపోయారు. పరామర్శించి ఊరుకోలేదు.. వెంటనే అక్కడ దీక్షకు కూర్చున్నారు. మూడు గంటలు చూసి పోలీసులు ఆమెను అక్కడి నుంచి బలవంతంగా తరలించాల్సి వచ్చింది.

ఇప్పటికే షర్మిల ప్రతి మంగళవారం.. ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి కుటుంబాన్ని పరామర్శించి దీక్షలు చేయడం అనే కాన్సెప్ట్‌ను అమలు చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా కాస్త విరామం ఇచ్చారు. అయితే ఇలాంటి అవకాశాలు వచ్చినప్పుడు మాత్రం వదిలి పెట్టడం లేదు. కానీ షర్మిల ఇలా ఆత్మహత్యలను రాజకీయం చేసుకోవడం చూసిన వాళ్లంతా ఏపీలోని పరిస్థితులే గుర్తు చేసుకంటున్నారు.. అక్కడే మైనస్ అవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘మ‌న‌మే’ టీజ‌ర్‌: క్యారెక్ట‌ర్ల మ‌ధ్య క్లాషు!

https://www.youtube.com/watch?v=_4Ff1zVtKkw శర్వానంద్ - శ్రీ‌రామ్ ఆదిత్య కాంబినేష‌న్‌లో 'మ‌న‌మే' రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. కృతి శెట్టి క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ రూపొందిస్తోంది. శ్రీ‌రామ్ ఆదిత్య త‌న‌యుడు ఈ చిత్రంలో...

‘కాంతార 2’లో మోహ‌న్ లాల్‌?

దేశాన్ని కుదిపేసిన క‌న్న‌డ చిత్రం 'కాంతార‌'. ఏమాత్రం అంచ‌నాలు లేకుండా, ఏమాత్రం ప్ర‌మోష‌న్లు చేయ‌కుండానే పాన్ ఇండియా స్థాయిలో విజ‌య ఢంకా మోగించింది. క‌న్న‌డ చిత్ర‌సీమ స్థాయిని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసింది. ఇప్పుడు...

మంత్రి ఉత్తమ్ ఇలాకాలో విద్యార్ధినిలకు అస్వస్థత..రీజన్ అదేనా..?

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని గురుకుల పాఠశాలలో విద్యార్థులు వరుసగా అస్వస్థతకు గురి అవుతుండటం కలకలం రేపుతోంది. యదాద్రి భువనగిరి జిల్లా గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కు గురై ఇటీవల ఓ విద్యార్ధి...

చిలుకూరుకు పోటెత్తిన భక్తులు…ఫుల్ ట్రాఫిక్ జామ్

కోరిన కోరికల్ని తీర్చే సుప్రసిద్ధ చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలకు భక్తులు పోటెత్తారు. ఆలయ సిబ్బంది అంచనా వేసిన దానికంటే పది రేట్లు ఎక్కువగా రావడంతో క్యూలైన్లు అన్ని నిండిపోయాయి. ఆలయానికి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close