సైలెంట్ అయిపోయిన టీఆర్ఎస్ – ఏం జరుగుతోంది ?

రాత్రి చేసిన హడావుడి .. తెల్లారేసరికి చల్లారిపోయింది. రాత్రి ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ ప్రయత్నించిందంటూ.. రచ్చ రచ్చ చేసిన ఆ పార్టీ మంత్రులు.. కొన్ని ్నుకూల మీడియా.. ఉదయానికి చల్లబడిపోయాయి. బీజేపీ నేతలు ఈ ఫామ్ హౌస్ కేసుపై ప్రెస్ మీట్ పెట్టి రెండు, మూడు గంటలు చెప్పిందంతా చెప్పారు. కానీ టీఆర్ఎస్ నేతలు మాత్రం సాయంత్రం వరకూ బయటకు రాలేదు. కేసీఆర్ ఎమ్మెల్యేలతో కలిసి మీడియా ముందుకు వస్తారని.. బుధవారం సాయంత్రం నుంచి చెబుతూ వస్తున్నారు. కానీ అలాంటి సూచనలేమీ కనిపించడం లేదు.

ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఫామ్ హౌస్ నుంచి నేరుగా ప్రగతి భవన్‌కు వచ్చారు. మళ్లీ బయటకు వెళ్లారో లేదో తెలియదు. బీజేపీ నేతల ఆరోపణలకు కౌంటర్ ఇవ్వలేదు. అయితే పోలీసులు మాత్రం… మొత్తం రూ. 250 కోట్ల డీల్ జరగబోయిందని ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. కానీ స్పాట్‌లో ఎంత క్యాష్ పట్టుకున్నారో చెప్పలేదు. అసలు పట్టుకున్నారో లేదో స్పష్టత లేదు. ఈ వ్యవహారం అంతా గందరగోళంగా మారింది. మరో వైపు ఈ కేసులో ఏసీబీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. ఈ సెక్షన్లు ఎలా వర్తిస్తాయని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. పోలీసుల తీరు.. ఎఫ్ఐఆర్ విషయంలోనే గందరగోళం ఉంది. అందుకే బీజేపీ నేతుల వెంటనే హైకోర్టులో పిటిషన్ వేశారు. పోలీసుల తీరుపై అనుమానం వ్యక్తం చేశారు. సీబీఐ లేద సిట్‌తో దర్యాప్తు చేయించాలన్నారు.

తనను బీజేపీ నేతలు ప్రలోభపరిచారని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బీజేపీతో సంబంధాలున్న సతీశ్ శర్మ, నంద కుమార్ అనే వ్యక్తులు టీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరితే రూ.100 కోట్లు, సెంట్రల్ గవర్నమెంట్ సివిల్ కాంట్రాక్టులతో పాటు కేంద్రంలో లాభదాయక పదవులు ఇస్తామని తనను ప్రలోభపెట్టారని రోహిత్ రెడ్డి కంప్లైంట్ లో పేర్కొన్నారు. ఒకవేళ తాను బీజేపీలో చేరని పక్షంలో ఈడీ, సీబీఐ దాడులు, క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందని, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని సైతం కూలదోస్తామని హెచ్చరించినట్లు రోహిత్ రెడ్డి కంప్లైంట్లో ప్రస్తావించారు. అయితే ఆ సతీష్ శర్మ.. నందకుమార్‌లకు బీజేపీతో సంబంధాలున్నాయని నిరూపించే సాక్ష్యాలు లేవు. వారు బీజేపీ నేతలతో దిగిన ఫోటోలు మాత్రమే ఉన్నాయి. నందకుమార్ టీఆర్ఎస్ నేతలతోనూ సన్నిహితంగాఉంటారు. ఆ ఫోటోలూ వైరల్ అయ్యాయి.

మొత్తంగా గంటన్నర రికార్డు చేశామని.. అమిత్ షా వాయిస్ రికార్డు అయిందని.. కిషన్ రెడ్డి వీడియోలు ఉన్నాయని టీఆర్ఎస్ నేతలు అంతర్గతంగా ప్రచారం చేస్తున్నారు కానీ గురువారం ఉదయం నుంచి వారెవరూ బయట మాట్లాడటం లేదు. పూర్తిగా సైలెంట్ అయిపోయారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close