చినజీయర్‌ను పట్టించుకోని వైసీపీ నేతలు ! కేసీఆర్‌కు కోపం వస్తుందనే ?

చినజీయర్ స్వామి అంటే జగన్‌కు ప్రత్యేకమైన అభిమానం. కారణం ఏదైనా.. శంషాబాద్ వైపు వెళ్తే… ముచ్చింతల్ వెళ్లి ఆశీర్వాదం తీసుకుని వస్తారు. ఇటీవల సమతామూర్తి విగ్రహానికి జగన్‌ను ప్రత్యేకంగా ఆహ్వానించారు. జగన్ కూడా వెళ్లి వచ్చారు. వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చాలా వరకూ ముచ్చింతల్లోనే ఉండి.. ఏర్పాట్లు చేశారు. ఆ తర్వాత ఆయనకు కేసీఆర్‌తో చెడింది. కేసీఆర్ ఆయనను దూరం పెట్టారు. ఇప్పుడు జగన్ కూడా ఆయనను దూరం పెడుతున్నట్లుగా కనిపిస్తోంది.

రెండు రోజుల కిందట… చినజీయర్ రాజమండ్రి పర్యటనకు వెళ్లారు. ఆయనను ఎవరూ పట్టించుకోలేదు. వైసీపీ నేతలు కూడా ఆయనను దర్శించుకోలేదు. మామూలుగా స్వరూపానంద వెళ్తేనే వైసీపీ నేతలు వరుసగా సాష్టాంగ ప్రమాణాలు చేసి భక్తిని ప్రదర్శించుకునేవారు. కానీ చినజీయర్‌ను మాత్రం లైట్ తీసుకున్నారు. మాములుగా అయితే వైసీపీ ప్రభుత్వంతో ఆయనకు ఎలాంటి విభేదాలు లేవు. కేవలం కేసీఆర్ దూరం పెట్టినందునే ఇక్కడ వైసీపీ నేతలు కూడా… ఆయనను పట్టించుకోవడం మానేశారు.

అందుకే.. చినజీయర్ కూడా తన అసంతృప్తిని బహిరంగంగానే వెల్లడించారు. రోడ్ల పరిస్థితిపై సెటైర్లు వేశారు. ఆయన రోడ్ల పరిస్థితిపై సెటైర్లు వేయడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. మామూలుగా అయితే ఆయన ఇలా జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యాలు చేయరు. కానీ.. జగన్ కూడా దూరం పెడుతున్నట్లుగా ఫీల్ కావడంతోనే ఇలా మాట్లాడారని అంటున్నారు. మొత్తానికి చినజీయర్‌ కు ఇద్దరు ముఖ్యమంత్రులూ దూరమైనట్లుగానే కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

HOT NEWS

css.php
[X] Close
[X] Close