ఓటుకి నోటు కేసులో వైకాపా అత్యుత్సాహం..కొంప ముంచుతుందేమో?

ఓటుకి నోటు కేసులో వైకాపా ప్రదర్శిస్తున్న అత్యుత్సాహం చూస్తుంటే అది మళ్ళీ దాని కొంప ముంచుతుందేమో? అనిపిస్తోంది. గతంలో ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తెదేపా ప్రభుత్వాన్ని గంటలో కూల్చగలనని గొప్పగా చెప్పుకొన్నందుకు ఏకంగా 20మంది వైకాపా ఎమ్మెల్యేలని పోగొట్టుకొన్నారు. మళ్ళీ ఇప్పుడు వైకాపాకి సంబంధం లేని ఓటుకి నోటు కేసులో అత్యుత్సాహం ప్రదర్శిస్తూ తెదేపాని రెచ్చగొడుతున్నారు.

ఆ కేసు విచారణపై హైకోర్టు 8 వారాలు స్టే విదించడంతో మంగళగిరి వైకాపా ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డి సుప్రీంకోర్టులో దానిని సవాలు చేశారు. ఈరోజు దానిని విచారించిన సుప్రీంకోర్టు, రాజకీయ ఉదేశ్యంతో ఇటువంటి కేసులు వేయడం తగదని సున్నితంగా చివాట్లు పెట్టి, ఈ కేసులో తాము జోక్యం చేసుకోదలచుకోలేదని స్పష్టం చేసింది. అయితే ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వేసిన క్వాష్ పిటిషన్ పై నెలరోజుల్లో నిర్ణయం తీసుకోమని హైకోర్టుకి సూచించింది. హైకోర్టు తీర్పు చెప్పిన తరువాత అప్పుడు కావాలనుకొంటే రామకృష్ణా రెడ్డి తమ దగ్గరకి రావచ్చని సుప్రీంకోర్టు చెప్పింది.

వైకాపాకి ఈ ఓటుకి నోటు కేసుతో ఎటువంటి సంబంధమూ లేకపోయినా, ముఖ్యమంత్రికి దీనితో ఇబ్బందికర పరిస్థితులు సృష్టించి అప్రదిష్టపాలు చేయాలని ప్రయత్నిస్తోందని అర్ధమవుతోంది. రాంకి కేసులో జగన్, విజయ సాయి రెడ్డిలకి ఈడి కోర్టు నుంచి విచారణకి కమ్మని ఆదేశిస్తూ నోటీసులు జారీ అవడం యాదృచ్చికమేనా లేక టిట్-ఫర్-టాట్ గా జరిగిన ప్రతిక్రియా అనేది తెలియవలసి ఉంది. చంద్రబాబు నాయుడు కుట్రలు, కుతంత్రాలు కూనిరాగం తీసినంత తేలికగా చేస్తుంటారని వైకాపా నేత భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. మరి వైకాపా ఏమి చేస్తోందిప్పుడు? ఓటుకి నోటు కేసుతో అసలు దానికి సంబంధం ఏమిటి? తెదేపాని రెచ్చగొడితే తామే నష్టపోతామని ఒకసారి అనుభవపూర్వకంగా తెలుసుకొన్న తరువాత కూడా ఇంకా ఎందుకు అత్యుత్సాహం ప్రదర్శిస్తోంది? “హైకోర్టు ఆ కేసు నుంచి చంద్రబాబు నాయుడుకి విముక్తి కల్పించలేదు. కేవలం 8 వారాలు గడువు మాత్రమే ఇచ్చింది. ఆ తరువాత ఆయనని ఏసిబి విచారించక మానదు,” అని వాదిస్తున్న వైకాపా మరి అంతవరకు ఎందుకు ఆగలేకపోయింది? అంటే అదే కారణం. రాజకీయ విద్వేషం. ఆ విద్వేషంతో చివరికి అదే నష్టపోతుందేమో? రాష్ట్రంలో కాంగ్రెస్, వామపక్షాలు కూడా చంద్రబాబు నాయుడుని విమర్శిస్తుంటాయి. కానీ వైకాపాలాగ వ్యక్తిగత కారణాలతో, వ్యక్తిగత స్థాయిలో ద్వేషించడం లేదు. కానీ జగన్ మాత్రం చంద్రబాబు నాయుడుని ద్వేషించడమే పార్టీ సిద్దాంతంగా చేసుకొని సాగుతున్నారు. అటువంటి సిద్దాంతాలతో ఏ పార్టీ కూడా ఎంతో కాలం మానుగడ సాగించలేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

రేవంత్ రెడ్డి యార్క‌ర్… ప్ర‌తిప‌క్షాలు క్లీన్ బౌల్డ్ అయిన‌ట్లేనా?

గ‌త కొంత‌కాలంగా బీఆర్ఎస్ రైతుల చుట్టూ రాజకీయం మొద‌లుపెట్టింది. పంట ఎండిపోతుంద‌ని, సాగుకు విద్యుత్ అంద‌టం లేద‌ని, ధాన్యం కొనుగోలు ఏమైంద‌ని, రుణమాఫీపై మౌనం ఎందుకు అంటూ నేత‌లంతా మూకుమ్మ‌డిగా రేవంత్ స‌ర్కారుపై...

‘మై డియర్ దొంగ’ రివ్యూ: స‌హ‌నం దొంగిలించేశాడు

అభినవ్ గోమఠం అంటే నవ్విస్తాడనే నమ్మకం ఏర్పడింది. ఒకవైపు క్యారెక్టర్ రోల్స్ చేస్తూనే మెయిన్ లీడ్ గా కూడా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పుడాయన టైటిల్ రోల్ లో 'మై డియర్ దొంగ' సినిమా...

4 చోట్ల టీడీపీ అభ్యర్థుల మార్పు ?

తెలుగుదేశం పార్టీ నలుగురు అభ్యర్థులను మార్చాలని నిర్ణయించుకుంది. నరసాపురం సిట్టింగ్ ఎంపీ అయిన కనుమూరు రఘురామకృష్ణరాజు ఉండి అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దింపడం దాదాపు ఖాయమే. మంతెన రామరాజుకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close