మహానటి సావిత్రి గాథ ని వెండి తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతొంది. సావిత్రి పాత్రలో నిత్య మీనన్ కనిపించనున్న ఈ చిత్రానికి నాగ అశ్విన్ దర్శకుడు. స్క్రిప్ట్ పనులు పూర్తి కావచ్చాయి. ప్రస్తుతం మిగిలిన పాత్రలకు అన్వేషణ సాగుతొంది. సావిత్రి కథ అంటే ఎన్టీఆర్, అక్కినేని ప్రస్తావన తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళతో సావిత్రికి ప్రత్యేకమైన అనుబంధం. ఆ దిగ్గజాలతో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది సావిత్రి. ఈ సినిమాలో కూడా ఎన్టీఆర్, అక్కినేని పాత్రలు వున్నాయి. అందులో ఎవరు కనిపిస్తే బాగుంటుంది అనే విషయం లో చిత్ర బృందం తర్జన భర్జనలు పడుతొంది.
ఎన్టీఆర్ పాత్రకి జూనియర్ ఎన్టీఆర్, అక్కినేని పాత్రకు నాగ చైతన్య లను తీసుకుంటే బాగుంటుందని అశ్వనీదత్ ఫీల్ అవుతున్నాడట. ఈ విషయమై ఇప్పటికే దత్ వాళ్ళిద్దరితోనూ మాట్లాడాడని, ఎన్టీఆర్, చైతూ లు కూడా సానుకూలంగా స్పందించారని తెలుస్తోంది. ఎన్టీఆర్, చైతూ లు కలసి ఓ సినిమాలో నటించాలని ఎప్పటినుంచో అనుకుంటున్నారు. గుండమ్మ కథ రీమేక్ చెయ్యాలన్న ఆలోచన కూడా వచ్చింది. ఐతే ఆ ప్రాజెక్ట్ ముందుకు కదలడం లేదు. కానీ ఆ కోరికను సావిత్రి ఇలా తీర్చిందన్న మాట. ఎన్టీఆర్, చైతూ లు సావిత్రి లో కనిపిస్తే ఈ ప్రాజెక్ట్ కి అదిరిపోయే క్రేజ్ రావడం ఖాయం.