అయినా సరే కేసీఆర్ ..మోదీకి స్వాగతం చెప్పరు !

తెలంగాణ సీఎం కేసీఆర్ మోదీ పర్యటనకు మరోసారి వెళ్లడంలేదు. ఇరవై ఆరో తేదీన ఆయన హైదరాబాద్‌కు వస్తున్నారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో జరిగే కార్యక్రమానికి మోదీ హాజరు కావాల్సి ఉంది. అధికారిక కార్యక్రమం కాబట్టి ప్రోటోకాల్ ప్రకారం.. సీఎం కేసీఆర్ మోదీకి స్వాగతం చెప్పడమే కాదు ఆయన పాల్గొనే కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంది. ఐఎస్‌బీ కార్యక్రమంలో పాల్గొనేందుకు కేసీఆర్‌కు ఆహ్వానం కూడా పంపారు. కానీ కేసీఆర్ పాల్గొనే అవకాశం లేదని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.

టీఆర్ఎస్ అధినేత మోదీకి మొహం చూపించకూడదనే ఢిల్లీ పర్యటనకు వెళ్లారని విపక్షాలు ఆరోపించారు. ఢిల్లీ నుంచి దేశవ్యాప్త పర్యటన చేయాలని ఐదు రోజుల కిందట ఆయన ఢిల్లీ వెళ్లారు. అయితే హఠాత్తుగా పర్యటనను కుదించుకుని సోమవారమే హైదరాబాద్ తిరిగి వచ్చారు. ఈ కారణంగా ఆయన మోదీ కార్యక్రమానికి హాజరవుతారా లేదా అన్న చర్చ ప్రారంభమయింది. అయితే మోదీ హాజరయ్యే కార్యక్రమాలకు ఎప్పట్లాగే దూరంగా ఉండాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.

గతంలో సమతామూర్తి విగ్రహావిష్కకరణ కార్యక్రమానికి కేసీఆర్ హాజరు కాలేదు. చివరి క్షణం వరకూ హాజరవుతారనుకున్నారు. కానీ శిలాఫలకంపై పేరు లేకపోవడంతో అవమానికి గురవుతానన్న ఉద్దేశంతో ఆయన ఆగిపోయారు. అప్పుడే ఇక్రిశాట్‌ సదస్సులో పాల్గొనేందుకూ వెళ్లలేదు. ఆ తర్వాత పీఎంవోనే కేసీఆర్‌ను హాజరు కావొద్దని చెప్పాయని టీఆర్ఎస్ వర్గాలు ప్రచారం చేశాయి. కేటీఆర్ కూడాఇదే అన్నారు. అయితే ఈ ప్రచారాన్ని కేంద్రం ఖండించింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close