వైయస్సార్ చిరంజీవికి కొట్టిన దెబ్బే పాల్ జగన్ కి కొడుతున్నాడా?

గత రెండు రోజులుగా కె.ఏ. పాల్ ని లక్ష్యం గా చేసుకుని ఇటు వైఎస్ఆర్సిపి నేతలు , సాక్షి ఛానల్ తీవ్రంగా దాడులు చేస్తున్నారు. కేవలం తమ పార్టీ అభ్యర్థులకు గండికొట్టడానికి కేఏ పాల్ ప్రయత్నిస్తున్నాడని, తమ పార్టీ అభ్యర్థుల పేర్లను పోలిన పేర్లతో అభ్యర్థులను నిలపెడుతున్నాడని సాక్షిలో కథనాలు రాస్తున్నారు. అయితే, జగన్ఆవేదనతో ఏకీభవించే వారికంటే, గతంలో ఇదే ఎత్తు గడ ని ఉపయోగించి వైయస్సార్ చిరంజీవి నిదెబ్బ కొట్టాడని, ఇది ” మీ తండ్రి నేర్పిన విద్యయే నీరజాక్షా” అని జనాలు అంటున్నారు. వివరాల్లోకి వెళితే..

వైఎస్ఆర్సిపి అభ్యర్థులను పోలిన పేర్లతో ప్రజాశాంతి పార్టీ అభ్యర్థులు:

రాయదుర్గంలో వైఎస్ఆర్సిపి కాపు రామచంద్రా రెడ్డిని నిలబడితే, ప్రజాశాంతి పార్టీ ఉండాల రామచంద్రారెడ్డి ని నిలబెట్టింది. ఉరవకొండలోవైఎస్ఆర్ సీపీ విశ్వేశ్వర్రెడ్డి నిలబడితే, ప్రజాశాంతిపార్టీ విశ్వనాథరెడ్డి నిలబెట్టింది. అనంతపురంలో వైఎస్ఆర్సిపి అనంత వెంకటరామిరెడ్డి నిలబెడితే, ప్రజాశాంతి పార్టీ పగడి వెంకట్రామిరెడ్డిని పోటీకి నిలబెట్టింది. గుంటూరు జిల్లాలోని ప్రత్తిపాడు లోఅయితే అదే పేరు ఉన్న నంబూరు శంకరరావు అనే వ్యక్తిని నిలబెట్టింది. దాదాపు 9 స్థానాల్లో ఈ విధంగా అభ్యర్థులను నిలబెట్టింది ప్రజాశాంతి పార్టీ.

2009 – చిరంజీవి ప్రజా రాజ్యం పార్టీ అభ్యర్థు ల మీద వైయస్ రాజశేఖర రెడ్డి ప్రోద్బలంతో పోటీ చేసినఇండిపెండెంట్ అభ్యర్థులు:

ఇప్పుడు రెండు జాబితాలను చూశాక చెప్పండి- తన పార్టీకి ఏదో అన్యాయం జరుగుతోందంటూ జగన్ పెడుతున్న గగ్గోలు నిజంగా సమంజసమేనా? సమంజసమే అయితే, పాల్ చేస్తున్న పనిని సాక్షి ఛానల్ లో ” మహా కుట్ర” అంటూ బ్యానర్ స్టోరీలు వ్రాయిస్తున్న జగన్ చిరంజీవి కి తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి చేసిన దాన్ని ఏమనాలి? పేర్లు పోల్చి చూసినా, పాల్ అభ్యర్థుల పేర్లకు వైఎస్ఆర్సిపి అభ్యర్థుల పేర్లకు కాస్తయినా తేడా ఉంది కానీ, మహానేత వైఎస్ రాజశేఖర్రెడ్డి చిరంజీవి విషయంలో ఇంతకంటే భయంకరంగా నే వ్యవహరించినట్టు పైన పేర్లు చూస్తే అర్థమవుతుంది.

తన పార్టీ ఎమ్మెల్యేలను చంద్రబాబు లాక్కున్న ప్పుడు జగన్ గగ్గోలు పెట్టినా, ప్రజల నుండి పెద్ద ఎత్తున స్పందన రాకపోవడానికి కూడా ఇదే కారణం. గతంలో తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి ఇతర పార్టీల ఎమ్మెల్యేలను అదేవిధంగా లాక్కొని ఉండడం వల్ల, వైయస్ రాజశేఖర రెడ్డి ఆ పని చేసినప్పుడు సాక్షి పత్రిక కూడా అదేదో ఘనకార్యం అన్నట్టు కీర్తించి ఉండడంవల్ల జగన్ తన ఎమ్మెల్యే ల గురించి గగ్గోలు పెడుతున్నా జనం పట్టించుకోలేదు. ఇప్పుడు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే ఏ పాల్ తన పార్టీ అభ్యర్థుల పేర్లతో పోలిన అభ్యర్థులను పోటీకి నిలబెడుతుండటం మహా కుట్ర అని జగన్ అంటున్నప్పటికీ, ఈ కారణం చేతనే, జనంలో స్పందన రావడం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇదేం స్ట్రాటజీ ఐ ప్యాక్ – గ్రాఫ్ పెరుగుతోందంటే ఆల్రెడీ తగ్గిపోయిందనే కదా అర్థం !

జగన్ మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరుగుతోందని ప్రచారం చేయాలి . మీకు ఎంత కావాలి ?. ఇది ఐ ప్యాక్ నుంచి వివిధ మీడియా సంస్థలకు.. సోషల్ మీడియా ఖాతాలకు .....

భీమవరం రివ్యూ : రౌడీ రాజకీయానికి గడ్డు కాలమే !

ఏపీలో వీఐపీ నియోజకవర్గాల్లో భీమవరం ఒకటి. పవన్ కల్యాణ్ ఇప్పుడు అక్కడ పోటీ చేయకపోయినా అంది దృష్టి ఈ నియోజకవర్గంపై ఉంది. తాను నామినేషన్ వేసినా పవనే అభ్యర్థి అని ...

కాంగ్రెస్‌తో కాదు రేవంత్ తోనే బీజేపీ, బీఆర్ఎస్ పోటీ !

తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో తాము కాంగ్రెస్ తో కాకుండా రేవంత్ తో పోటీ పడుతున్నట్లుగా రాజకీయాలు చేస్తున్నారు. రేవంత్ ను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని ఏమీ...

ప్రచారంలో పొలిటికల్ గ్లామర్ ఏదీ..?

ఎన్నికలు అనగానే ప్రధాన పార్టీలు సినీ తారల సేవలను ప్రచారంలో ఒకప్పుడు వాడుకునేవి. కానీ, రానురాను ఆ సంప్రదాయం తెరమరుగు అవుతోంది. తమ సేవలను వాడుకొని వదిలేస్తున్నారనే భావనతో ప్రచారాలకు దూరం పాటిస్తున్నారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close