జగన్‌కు “పీకే” సేవలు అందనా !?

మార్చి నుంచి మన కోసం ప్రశాంత్ కిషోర్ వస్తారు. మనం అందరం ప్రజల్లోకి వెళ్లాలి. ఇక ప్రజల్లోనే ఉండాలి అని గత ఏడాది జరిగిన ఓ కేబినెట్ భేటీలో సీఎం జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గ సహచరులకు వివరించారు. అయితే ఇప్పుడు మార్చి వచ్చేసింది. కానీ ప్రశాంత్ కిషోర్ వచ్చారో లేదో స్పష్టత లేదు. తెలంగాణకు అయితే వచ్చారని ఫోటోలతో సహా సాక్ష్యాలు వెలుగులోకి వచ్చాయి. ఆయన టీఆర్ఎస్ కోసం పని చేయబోతున్నట్లుగా స్పష్టమయింది. మరి జగన్ కోసం పని చేస్తారా లేదా అన్నదానిపైనే స్పష్టత లేదు.

గత ఎన్నికల్లో వైసీపీకి విజయం సాధించి పెట్టిన తర్వాత ప్రశాంత్ కిషోర్ సైలెంటయ్యారు.ఆయన అధికారికంగా వైసీపీకి పని చేయడం లేదు.కానీ ఆయన టీమ్‌లో పని చేసిన చాలా మంది ఏపీ ప్రభుత్వ డిజిటల్ కార్పొరేషన్లలో చేరారు. వారే సోషల్ మీడియా క్యాంపైన్లు నిర్వహిస్తున్నారు. కానీ పీకే నేరుగా ప్రత్యక్షంగా రంగంలోకి దిగితే ఉండే ఎఫెక్ట్ వేరు. అయన కేసేఆర్ కోసం పని చేయడానికి సిద్ధమయ్యారు కానీ.. జగన్ కోసం పని చేస్తారా లేదా అన్నదానిపై స్పష్టత లేకుండా పోయింది.

జగన్‌తో పీకేకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. పీకే టీంలో సభ్యుల పెళ్లికి కూడా ఆయన కుటుంబసమేతంగా లక్నో లాంటి ప్రాంతాలకు వెళ్లివచ్చారు. అయితే పీకే ఎవరికి పని చేస్తారాన్నదానిపై కొన్ని లెక్కలు వేసుకుంటారు. పోటాపోటీగా ఉన్న పార్టీ కోసమే ఆయన పని చేస్తారు. షర్మిలకు పని చేయడానికి సిద్ధమైనా… కనీస ప్రభావం చూపలేమని అర్థమైపోయి వెనక్కి తగ్గారు. పైగా జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టిన పీకే.. ఇక ఏ పార్టీకి స్ట్రాటజిస్ట్‌గా పని చేయనని చెప్పారు. ఇప్పుడు కేసీఆర్ కోసం పనిచేస్తున్నారు. జగన్ విషయంలో ఏం చేస్తారో చూడాలి !

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

HOT NEWS

css.php
[X] Close
[X] Close