“రాధా” కి స్వంత సామాజిక వర్గం ప్రశ్నల వర్షం

వంగవీటి రాధా భవితవ్యం డోలాయమానం లో పడింది. రాధా, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ టిక్కెట్ ఆశిస్తుండగా, జగన్ ఆ టికెట్ మల్లాది విష్ణు కి ఇవ్వబోతున్నట్టు, రాధా ని మచిలీపట్నం ఎంపీగా పోటీ చేయమని అడిగినట్టు వార్తలు వచ్చిన నేపథ్యంలో, రాధా అలకబూనారు. ఎలమంచిలి రవి, కొడాలి నాని తదితరులు రాధా తో భేటీ అయినప్పటికీ రాధా మెత్తబడ్డ లేదని తెలుస్తోంది. అయితే రాధా కి ఈసారి సొంత సామాజిక వర్గం పూర్తిగా వెన్నుదన్నుగా నిలుస్తుందా లేదా అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ప్రత్యేకించి అభిమానులే కొన్ని ప్రశ్నలతో ఆయనను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు.

గతంలో వైఎస్సార్ సీపీ పార్టీకే చెందిన గౌతమ్ రెడ్డి వంగవీటి రంగా పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రంగాన్ని పాము తో పోలుస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. పార్టీ కూడా గౌతమ్ రెడ్డి ని సస్పెండ్ చేస్తూ ప్రకటన జారీ చేసింది. అయితే ఆ తర్వాత కొంతకాలానికి మళ్లీ గౌతమ్ రెడ్డి పార్టీలో కి తిరిగి వచ్చి, మళ్లీ మునుపటిలా గానే కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. అయితే గౌతమ్ రెడ్డి పార్టీలోకి తిరిగి వచ్చినప్పుడే, వంగవీటి రాధా జగన్ పై అసమ్మతి రాగం మొదలు పెట్టి పార్టీ నుంచి బయటకు వచ్చి ఉంటే ఆ పరిస్థితి మరోలా ఉండేదని ఆయన అభిమానులు వ్యాఖ్యలు చేస్తున్నారు.

అలాగే, కృష్ణా జిల్లాలో పర్యటన సందర్భంగా జగన్, ఆ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతాం అని ప్రకటించాడు. అయితే అనూహ్యమైన రీతిలో ఆ ప్రకటన పై వ్యతిరేకత రావడంతో మళ్లీ దానికి సంజాయిషీ ఇచ్చుకున్నారు. మొత్తం జిల్లాకు కాదని, జిల్లాను రెండుగా విభజించి ఒక దానికి మాత్రమే ఎన్టీఆర్ పేరు పెడతాం అని ” కవర్ డ్రైవ్ ” చేయబోయారు. అయితే అప్పుడు కూడా వంగవీటి రాధా మిన్నకుండిపోయారు. తన అభిమానుల కోరిక మేరకు అప్పుడు గళమెత్తినా కూడా పరిస్థితి మరోలా ఉండేదని ఆయన సామాజిక వర్గానికి చెందిన వారు అంటున్నారు.

ఇక ఆ తర్వాత జగన్ కాపు రిజర్వేషన్లపై మెలిక పెట్టినప్పుడైనా రాధ మాట్లాడి ఉండవలసిందని , అప్పుడు బయటికి వచ్చి ఉన్నా, తన సొంత సామాజిక వర్గంలో ఆయన ఇమేజ్ మరొక లా ఉండేదని వారంటున్నారు.

కానీ, ఆ మూడు సందర్భాలలోనూ బయటకి రాకుండా , గళం ఎత్తకుండా మిన్నకుండిపోయి, ఇప్పుడు కేవలం తనకు కావలసిన టికెట్ రాలేదని పార్టీ నుంచి బయటకు రావడాన్ని ఆయన సామాజిక వర్గానికి చెందిన వాళ్లతో పాటు సొంత అభిమానులు కూడా తప్పు పడుతున్నారు.

మరి ఈ నేపథ్యంలో రాధా భవితవ్యం ఎలా ఉంటుందో అన్నది ప్రశ్నార్థకంగా మారింది

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close