స్టీల్ ప్లాంట్‌కు భారీ లాభాలు..! అయినా అమ్మేస్తారా..?

స్టీల్ ప్లాంట్ నష్టాలు.. రుణ భారం కారణంగా వంద శాతం అమ్మేస్తున్నామని కేంద్రం చెబుతోంది కానీ.. ముగిసిన ఆర్థిక సంవత్సరానికి స్టీల్ ప్లాంట్ పనితీరు చూస్తే అది బంగారు బాతు అని సులువుగానే అర్థమవుతుంది. చాలా కాలం లాక్ డౌన్ ఉన్నప్పటికీ… గత ఆర్థిక సంవత్సరం వైజాగ్ స్టీల్స్ టర్నోవర్‌ రూ.18 వేల కోట్లు దాటింది. ఇది స్టీల్ ఫ్యాక్టరీ చరిత్రలోనే రెండో అత్యధిక టర్నోవర్. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే.. 2020-21లో కర్మాగారం 13 శాతం వృద్ధి నమోదు చేసింది. అంతే కాదు.. 4 నెలల్లో రూ.740కోట్ల నికర లాభం నమోదైంది. ఆర్థిక సంవత్సరం చివరి నెల.. ఈ మార్చిలో రూ.3,300కోట్ల ఉక్కును విక్రయించారు.

కర్మాగారం చరిత్రలో ఒక నెలలో వచ్చిన అత్యధిక ఆదాయం అది. ఈ విషయాలను అధికారికంగా స్టీల్ ప్లాంట్ యాజమాన్యమే ప్రకటించింది. ఇదంతా క్యాప్టివ్ మైన్స్ లేకుండానే స్టీల్ ప్లాంట్ యాజమాన్యం పనితీరు ఇది. నిజంగా క్యాప్టివ్ మైన్స్ కేటాయించి ఉంటే… అత్యధిక లాభాలు ఆర్జింటే స్టీల్ ప్లాంట్లలో ..విశాఖ స్టీల్స్ మొదటి వరుసలో ఉంటుందనడంలో సందేహం ఉండదని నిపుణులు అంటున్నారు. స్టీల్ ప్లాంట్ ఉద్యోగ జేఏసీ సంఘం నేతలు కూడా అదే చెబుతున్నారు. స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉందని.. రుణభారం ఎక్కువ ఉందనేది …అమ్మేయడానికి కారణాలు వెదుక్కోవడానికేనని అంటున్నారు.

ప్రస్తుతం స్టీల్‌కు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోంది. ఈ తరుణంలో క్యాప్టివ్ మైన్స్ లేకపోయినా ప్లాంట్ లాభాల్లోకి వస్తుందని అంటున్నారు. మరోవైపు స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు తమ నిరసనల్ని మరింత ఉధృతం చేయాలని నిర్ణయించుకున్నారు. ఇవి పెరగకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సూచిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ వైఖరే కాస్త తేడాగా ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close