అమరావతికి వరల్డ్ బ్యాంక్ రుణం క్యాన్సిల్.. పూర్తిగా జగన్ క్రెడిట్..!?

అమరావతికి ప్రపంచబ్యాంక్ ఇస్తామన్న రుణాన్ని.. ఏపీ సర్కార్ కాలదన్నుకుందని.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. బీజేపీ-జనసేన బృందానికి.. సాక్ష్యాలతో సహా వివరించారు. అమరావతి నిర్మాణం.. ఏపీ ఆర్థిక పరిస్థితులపై.. బీజేపీ -జనసేన నేతలు నిర్మలా సీతారామన్‌ను కలిసినప్పుడు.. అమరావతికి ప్రపంచబ్యాంక్ రుణంపై ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. అమరావతికి రుణం ఇచ్చేందుకు మొత్తం ప్రక్రియ పూర్తి చేసిన ప్రపంచబ్యాంక్.. వైసీపీ అధికారంలోకి రాగానే.. రుణ ప్రతిపాదన విరమించుకుంది. దీనికి కారణం ఏమిటో క్లారిటీ లేదు. కానీ.. ఏపీ సర్కార్ ఉద్దేశపూర్వకంగా.. అమరావతిని నిర్వీర్యం చేయాలన్న ముందస్తు ప్రణాళికతోనే.. ప్రపంచబ్యాంక్ రుణం అవసరం లేదన్నట్లుగా.. వ్యవహరించింది. కేంద్ర ప్రభుత్వం పదే పదే సంప్రదించినా… ప్రధాని మోడీ సూచనలతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. స్వయంగా .. వాకబు చేసినా కూడా.. ఏపీ సర్కార్.. ఆసక్తి చూపలేదు.

బతిమాలి మరీ అప్పు ఇచ్చే పరిస్థితుల్లో ప్రపంచబ్యాంక్ లేదు కాబట్టి.. సైలెంట్‌గా ప్రతిపాదన విరమించుకుంకుంది. రాజధాని నిర్మాణానికి “అమరావతి సస్టెయినబుల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్ట్‌” పేరుతో 715 మిలియ‌న్ డాల‌ర్ల రుణం కోసం చంద్రబాబు సర్కార్ ప్రయత్నించింది. ఇది దాదాపుగా రూ. ఐదు వేల కోట్లతో సమానం. మరో రూ. రెండు వేల కోట్ల రుణం కోసం.. ఆసియా డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ను సంప్రదించింది. వరల్డ్ బ్యాంక్ తొలి దశలో సుమారు రూ.2065 కోట్లు రుణం ఇవ్వడానికి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. తొలిదశలో రుణం తీసుకునేందుకు కేంద్రం కూడా అనుమతులిచ్చింది. అమరావతికి ఇక రుణం మంజూరేనని.. అనుకుంటున్న సమయంలో.. ప్రపంచబ్యాంక్ షాకిచ్చింది. రుణ ప్రతిపాదనల నుంచి ఒక్క సారిగా డ్రాప్ అయిపోయింది. అసలు దీని వెనుక ఏం జరిగిందన్నదానిపై.. మాత్రం.. రకరకాల చర్చలు జరిగాయి.

ఏపీలో చంద్రబాబు సర్కార్ ఓడిపోగానే… ప్రపంచబ్యాంక్ నుంచి కేంద్రానికి ఓ లేఖ వచ్చింది. అమరావతి రుణ ప్రతిపాదన చివరి పరిశీలనలో ఉందని..అయితే.. గతంలో వచ్చిన అభ్యంతరాల మేరకు.. ఓ సారి పూర్తి స్థాయి పరిశీలన జరుపుతామని ఆ లేఖ సారాంశం. దీనిపై.. కేంద్రం.. రాష్ట్రానికి లేఖ రాసింది. కొత్తగా అధికారం చేపట్టినప్పుడు లేఖ రావడంతో ఇప్పుడే కొత్త సర్కారు ఏర్పడిందని .. దానిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని, అప్పటి వరకు నిర్ణయాన్ని వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. మూడు సార్లు ప్రభుత్వం ఏ నిర్ణయం చెప్పకపోవడం.. నిర్మలా సీతారామన్ మాట్లాడినా.. ఫలితం లేకపోవడంతో.. ప్రపంచబ్యాంక్ రుణ ప్రతిపాదనను విరమించుకుంది. అంటే.. ప్రస్తుత ఏపీ సర్కార్ ప్రాధాన్యాల్లో అమరావతి లేకపోవడంతో.. రుణం విషయంలో.. ఎలాంటి ఆసక్తి చూపించలేదన్న విషయం.. నిర్మలా సీతారామన్ వివరించారు. దీనిపైనా.. కేంద్రంపై నిందలేస్తున్నారన్న అసంతృప్తి బీజేపీ -జనసేనల్లో కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

ఇదేం స్ట్రాటజీ ఐ ప్యాక్ – గ్రాఫ్ పెరుగుతోందంటే ఆల్రెడీ తగ్గిపోయిందనే కదా అర్థం !

జగన్ మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరుగుతోందని ప్రచారం చేయాలి . మీకు ఎంత కావాలి ?. ఇది ఐ ప్యాక్ నుంచి వివిధ మీడియా సంస్థలకు.. సోషల్ మీడియా ఖాతాలకు .....

HOT NEWS

css.php
[X] Close
[X] Close