అధికార పార్టీగా కూడా ఆరోపణలేనా.. సాక్ష్యాలేవి అంబటి..?

ఆధారాలతో సహా టీడీపీ నేతల ఇన్‌సైడర్ ట్రేడింగ్ వ్యవహారాలను బయటపెడతామంటూ.. ఉదయం నుంచి మీడియా అందరికీ.. చాలా ఉత్కంఠగా ఎదురు చూసేలా.. చెప్పిన వైసీపీ నేతలు.. చివరికి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీలో చూపించిన వీడియోను మీడియా ముందు ప్రదర్శించారు. అందులో ఎలాంటి డాక్యుమెంటరీ ఆధారాలు చూపించకపోగా… రాజధాని పరధిలో కాకుండా.. కృష్ణా జిల్లాలో కొన్న భూములను కూడా.. ఇన్ సైడర్ ట్రేడింగ్‌ జాబితాలో చేర్చారు. చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ గ్రూప్ కంతేరులో పధ్నాలుగు ఎకరాలు కొన్నదని మరోసారి వైసీపీ నేతలు వీడియో ప్రదర్శించారు. మ్యాప్ కూడా చూపించారు. అందులోనే రాజధాని ఏరియాకు.. కంతేరుకు చాలా దూరం కనిపిస్తోంది.

ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటే.. టీడీపీ గెలిచినప్పటి నుండి రాజధాని ప్రకటించే మధ్య కాలంలో జరిగిన లావాదేవీలు. ఈ మధ్య కాలంలో.. నాలుగు వేల ఎకరాలకుపైగా.. లావాదేవీలు జరిగినట్లుగా.. వైసీపీ నేతలు వీడియో చూపించారు. రావెల కిషోర్, కొమ్మాలపాటి శ్రీధర్, పరిటాల సునీత, నారాయణలను కూడా చూపిస్తూ.. భూములు కొన్నారని ఆరోపించారు. ఇవన్నీ.. చాలా కాలంగా చేస్తున్న ఆరోపణలే. వీటికి ఆధారాలుగా డాక్యుమెంట్లను చూపిస్తారేమోనని మీడియా అంతా ఎదురు చూసింది. కానీ ఎలాంటి డాక్యుమెంటరీ ఆధారాలు చూపించలేదు కానీ.. సాక్షి పత్రికలో వచ్చిన కథనాలతో.. ఓ డాక్యుమెంటరీని మాత్రం ప్రదర్శించారు.

ఆధారాలతో సహా నిరూపిస్తామని.. వైసీపీ నేతలు చెప్పే సరికి.. మీడియా అంతా ఎంతో ఆసక్తి ప్రదర్శించింది. అందరూ ప్రత్యక్ష ప్రసారం చేశారు. తీరా.. పాత ఆరోపణలను కొత్తగా వీడియో రూపంలో చెప్పి ఊసూరుమనిపించారు. నిజానికి బుగ్గన అసెంబ్లీలో ఆరోపణలు చేసినప్పుడే.. దాదాపుగా అందరూ వివరణ ఇచ్చారు. తాము రాజధాని ప్రకటించక ముందో.. ప్రకటించిన తర్వాతో కొన్నామన్నారు. వారు ఇచ్చిన వివరణకు భిన్నంగా.. వారు ఫలానా సమయంలోనే భూములు కొన్నారని.. డాక్యుమెంట్లు చూపిస్తారేమోనని.. జర్నలిస్టులు భావించారు. ఎందుకంటే.. ప్రభుత్వం వారి చేతుల్లో ఉంది కాబట్టి. అలాంటివేమీ లేకుండా… సాక్షి టీవీలో వచ్చే ఓ ఆరోపణల వీడియోను ప్రదర్శించి.. అవే సాక్ష్యాలు అనుకోమన్నారు వైసీపీ నేతలు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏబీపీ సీఓటర్ సర్వే : బీఆర్ఎస్‌కు ఒక్కటే !

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి మంచి జోరు మీద ఉన్న కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికల్లో గట్టి పోటీ ఎదురయినప్పటికీ పది వరకూ లోక్ సభ సీట్లను గెల్చుకునే అవకాశం...

ఏబీపీ సీఓటర్ సర్వే : టీడీపీ కూటమికి 20, వైసీపీకి 5 లోక్‌సభ సీట్లు

ఎన్డీఏ కూటమి బలం రోజు రోజుకు పెరుగుతోంది. వైసీపీపై వ్యతిరేకత అంతకంతకూ పెరుగుతోందని సర్వేల వెల్లడిస్తున్నయి. అత్యంత ఖచ్చితంగా సర్వేలు, ఒపీనియన్ పోల్స్ వెల్లడిస్తుందని పేరున్న ఏబీపీ- సీఓటర్ ఎన్నికలకు ముందు నిర్వహించిన...

సునీత సాక్ష్యాలకు పాత ఆరోపణలే అవినాష్ రెడ్డి కౌంటర్ !

వివేకా హత్య కేసులో సునీత జస్టిస్ ఫర్ వివేకా పేరుతో పెడుతున్న ప్రెస్ మీట్లు వెల్లడిస్తున్న సంచనల విషయాలతో అవినాష్ రెడ్డికి మైండ్ బ్లాంక్ అవుతోంది. స్పందించకపోతే నిజం అని...

రాయి కేసు : లీకులిచ్చి జగన్ పరువు తీసిన పోలీసులు !

అనవసర డ్రామాలతో భద్రతా వైఫల్యమని పోలీసుల్ని చేతకాని వాళ్లుగా చేస్తున్నారని కోపం వచ్చిందేమో కానీ విజయవాడ పోలీసులు వైసీపీతో పాటు జగన్ పరువు తీసే లీకులు మీడియాకు ఇచ్చారు. జగన్ పై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close