వైకాపా వ్యూహంతో ఫిరాయింపులకి బ్రేక్ పడుతుందా?

తెదేపా ప్రభుత్వాన్ని పడగొడతానని జగన్ ప్రకటించడంతో వైకాపా ఎమ్మెల్యేలని ఆకర్షించడం మొదలుపెట్టింది తెదేపా. తమ పార్టీ ఎమ్మెల్యేలని తెదేపా ఎత్తుకుపోతుండటంతో దానిని అడ్డుకొనేందుకు రాజధానిలో తెదేపా నేతల భూబాగోతాలను బయటపెట్టారు. అదే సమయంలో ముద్రగడ కూడా మళ్ళీ ప్రభుత్వానికి జగన్ బాషలో లేఖ వ్రాయడంతో ఆయనను కూడా జగనే ప్రభుత్వంపైకి ఉసిగొల్పారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఈరోజు కూడా జగన్ సొంత మీడియా సాక్షిలో రాజధాని భూబాగోతాలలో చాలా మంది తెదేపా నేతల పేర్లను బయటపెట్టింది. ఈరోజు జాబితాలో మంత్రి నారాయణ (3,129), ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ (4.09), స్పీకర్ కోడెల శివప్రసాద రావు కుమారుడు (17.3) ఎకరాల భూమిని, ఎమ్మెల్యే దూళిపాళ్ళ నరేంద్ర రూ.5కోట్లు విలువయిన పోరంబోకు భూమిని తమ బినామీల పేరిట కొన్నట్లు పేర్కొంది. దానిలో ఆ బినామీలు ఎవరెవరి వద్ద నుండి ఎంతెంత విస్తీర్ణం ఉన్న భూమిని కొనుగోలు చేసారో కూడా పేర్కొంది. ఈ భూబాగోతంలో ప్రధాన పాత్ర పోషించింది మంత్రి నారాయణేనని సాక్షి పేర్కొంది. వైకాపా తరపున సాక్షి మీడియా చేస్తున్న ఈ తీవ్ర ఆరోపణలకు వారందరూ ఏమని సమాధానం చెపుతారో చూడాలి. అలాగే ఈ ఆరోపణల ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఫిరాయింపులని ప్రోత్సహించడాన్ని తెదేపా తాత్కాలికంగా నిలిపివేస్తుందా లేక వైకాపా వేసిన ఈ ఎత్తుకి పైఎత్తు వేసి ముందుకు సాగుతుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఛోటా కె.నాయుడు Vs హ‌రీష్ శంక‌ర్‌… ఏం జ‌రిగింది?

'మ‌ళ్లీ నా జోలికొచ్చారో... చూసుకొందాం' అంటూ సినిమా ఫ‌క్కీలో కెమెరామెన్‌ ఛోటా కె.నాయుడుకు వార్నింగ్ ఇచ్చాడు హ‌రీష్ శంక‌ర్‌. వీరిద్ద‌రూ క‌లిసి 'రామ‌య్యా వ‌స్తావ‌య్యా' సినిమా చేశారు. అప్ప‌టి నుంచీ ఇద్ద‌రి మ‌ధ్యా...

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close