తెదేపాలో చేరిన ఎమ్మెల్యేలపై చెవిరెడ్డి స్పీకర్ కి పిర్యాదు

తెదేపాలో చేరిన వైకాపా ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రు, వరుపుల సుబ్బారావు, సునీల్ కుమార్ ముగ్గురిపై అనర్హత వేటు వేయవలసిందిగా కోరుతూ వైకాపా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి శనివారం స్పీకర్ కోడెల శివప్రసాద రావుకి ఒక వినతి పత్రం అందించారు. వారు ముగ్గురూ పార్టీని వీడి తెదేపాలో చేరినప్పటికీ ఇంకా వైకాపా ఎమ్మెల్యేలుగానే కొనసాగుతున్నందున వారి ముగ్గురిని అనర్హులుగా ప్రకటించాలని చెవిరెడ్డి పార్టీ తరపున స్పీకర్ ని కోరారు.

ఇంతవరకు తెదేపాలో చేరిన వారి సంఖ్య 12 అయితే చెవిరెడ్డి ఇచ్చిన లేఖలో కేవలం ముగ్గురి పేర్లే ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. అంటే మిగిలినవారు మళ్ళీ పార్టీలోకి తిరిగి వచ్చేస్తారని వైకాపా భావిస్తోందా లేక ఇంకా తెదేపాలో చేరేవారు ఎవరయినా ఉంటే అందరికి కలిపి ఒకేసారి మరో లేఖ ఇస్తుందో తెలియదు.

వైకాపా పద్ధతి ప్రకారం స్పీకర్ కి విజ్ఞప్తి పత్రం ఇచ్చింది. దానిపై స్పీకర్ ఎప్పుడు నిర్ణయం తీసుకొంటారో ఆయన ఇష్టం. ఏ మాత్రం రాజకీయ అవగాహన ఉన్నవారయినా అయన వారిపై చర్యలు తీసుకోరని చెప్పగలరు. తీసుకోకపోయినా ఎవరూ ఏమీ చేయలేరని తెలంగాణాలో ఇప్పటికే రుజువయింది. అయినా దీనిపై వైకాపా న్యాయపోరాటం చేస్తుందని జగన్మోహన్ రెడ్డి ఇవ్వాళ్ళే ప్రకటించారు. కనుక ప్రధానిని, రాష్ట్రపతిని కలిసి వచ్చిన తరువాత ఆ కార్యక్రమం పెట్టుకోవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close