అధికార పార్టీ ప్రాంతీయ గర్జనలు -వైసీపీ దింపుడు కళ్లెం ఆశలు !

వైసీపీ రాజకీయ వ్యూహాలన్నీ పూర్తిగా చేతులెత్తేసినట్లుగానే ఉన్నాయి. ఉత్తరాంధ్ర, కోస్తాల్లో ఆశలు వదిలేసినట్లుగా.. రాయలసీమపైనే దృష్టి కేంద్రీకరిస్తున్నారు. అక్కడి ప్రజల్లో సీమ సెంటిమెంట్ ఎంత రెచ్చగొడితే అంత మేర లాభమని అనుకుంటున్నారు. ఐదో తేదీన ఏకంగా రాయలసీమ గర్జన పెడుతున్నారు. ఎందుకీ గర్జనో అధికార పార్టీ చెప్పలేదు., ఎందుకంటే… హైకోర్టు కర్నూలులో పెట్టాలంటే అధికార పార్టీనే చేయాలి. కానీ టీడీపీ పై రెచ్చగొట్టడానికి ఈ సభ ఏర్పాటు చేస్తన్నారు.

రాయలసీమలో వైసీపీకి గరిష్ట స్థాయిలో సీట్లు ఉన్నాయి. మూడు తప్ప మొత్తం వైసీపీవే. ఇంతకు మించి గెలవడానికి వైసీపీకి అవకాశం లేదు. కానీ పాలన నాసిరకంగా ఉండటంతో ప్రజల్లో అసంతృప్తి ఎక్కువగా కనిపిస్తోంది. దీంతో సగం సీట్లు పోయినా.. అధికారం పోతుందన్న భయంతో అన్నింటినీ నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకే పాలనలో ఏం చేశామో చెప్పుకోలేక… సీమ సెంటిమెంట్‌పై ఆశలు పెట్టుకుంటున్నారు. రెచ్చగొట్టుడు కార్యక్రమాలకు సిద్ధపడుతున్నారు. రాయలసీమలో ఎంత సెంటిమెంట్ రెచ్చగొడితే.. ఉత్తారంధ్ర, కోస్తాల్లో అంత మైనస్ అవుతుందని అంచనా వేయలేకపోతున్నారు. ఎందుకంటే.. అక్కడ టీడీపీ, జనసేన పొత్తులు పెట్టుకుంటే.. తమకేమీ మిగలవని వారికి అర్థమయిందంటున్నారు.

రాయలసీమలో అయినా పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో ఉన్న సీట్లు నిలబెట్టుకునే ప్రయత్నం కోసం అధికార పార్టీ గా ఉండి.. నైతికంగా దిగజారిపోయి.. ప్రాంతీయ గర్జనలు నిర్వహిస్తున్నారు. దీనికి ప్రజల మద్దతు ఉందని అనిపించడానికి స్కూల్ బస్సులు.. బలవంతపు జన సమీకరణ చేస్తున్నారు. ఇవన్నీ ప్రజల్లో అధికార పార్టీపై వ్యతిరేకత పెంచుతాయి కానీ… సానుకూలత తీసుకు రావు. కానీ వైసీపీ దింపుడు కళ్లం ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మేనిఫెస్టో మోసాలు : ఎస్సీ, ఎస్టీలకు చెప్పింది ఒక్కటి కూడా చేయలేదేందయ్యా !

జగన్ మోహన్ పాదయాత్రలో కొన్ని వందల హామీలు ఇచ్చారు. కానీ అవేమీ మేనిఫెస్టోలో పెట్టలేదు. అందుకే ఇప్పుడు తాము ఆ హామీలు ఇవ్వలేదని వాదిస్తూ ఉంటారు. తప్పుడు ఆలోచనలు చేసే వారి రాజకీయాలు...

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close