బందరు పోర్టు పేరుతో అప్పు తెచ్చి బటన్ నొక్కేశారుగా .. ఎలా కడతారు !?

గత ప్రభుత్వంలో శంకుస్థాపనలు చేసి పనులు ప్రారంభించిన వాటిని తాను రాగానే ఆపేసి.. మళ్లీ ఎన్నికలకు ముందు శంకుస్థాపనలు చేస్తున్న జగన్ రెడ్డి… మార్క్ రివర్స్ పాలనలో ఇప్పుడు బందరు పోర్టుది. బందరు పోర్టుకు మూడో సారి శంకుస్థాపన చేస్తున్నారు. గతంలో ఆయన తండ్రి వైఎస్ కూడా ఎన్నికలకు ఏడాది ముందు శంకుస్థాపన చేశారు. 2009 ఏప్రిల్‌లో సార్వత్రిక ఎన్నికలు జరగడానికి ఏడాది ముందు, 2008 ఏప్రిల్‌ 23న బందరు పోర్టుకు నాటి సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. పనులు మాత్రం సాగలేదు.

2019 ఫిబ్రవరి 7న నవ్యాంధ్ర సీఎం హోదాలో చంద్రబాబు బందరు పోర్టుకు శంకుస్థాపన చేశారు. దాదాపుగా ఐదు వందల కోట్ల రూపాయల పనులు కూడా జరిగాయి. కానీ… వైసీపీ సర్కారు దీనినీ ‘రివర్స్‌’ బాట పట్టించింది. ఇప్పుడు… ఎన్నికల ఏడాదిరాగానే మళ్లీ బందరు పోర్టు పేరిట హడావుడి మొదలుపెట్టింది. ఎన్నికలు మరో ఏడాదిలో జరగనున్నాయి. పోర్టు పనులను దక్కించుకున్న మేఘా సంస్థ ఇప్పటివరకు పోర్టు పనులను ఎక్కడా చేయలేదు. వివిధ ప్రాంతాల్లో భారీ నిర్మాణాలు చేసినా పోర్టు పనులు చేయడం ఇదే ప్రథమం. ఈ నేపథ్యంలో ఎంతవరకు మేఘా సంస్థ పోర్టు పనులను చేస్తుందనేది అనుమానంగా ఉంది.

నిజానికి పోర్టు పేరుతో ఇప్పటికే అప్పు తెచ్చేసి బటన్ నొక్కే పథకాలకు మళ్లించారన్న ప్రచారం జరుగుతోంది. మేరిటైమ్ కార్పొరేషన్ పేరుతో గుట్టుగా .. పోర్టుల నిర్మాణం కోసమని రుణాలు తీసుకున్నారు. చివరికి వాటిని మళ్లించేసారు. ఇప్పుడు పోర్టు కట్టడానికి డబ్బుల్లేవని.. ప్రభుత్వం ఇవ్వాల్సిందేనంటున్నారు. ఆ రుణాలు మేరిటైమ్ కార్పొరేషన్ పేరు మీదనే ఉన్నాయి. మేఘా పోలవరం ప్రాజెక్టును తీసుకుని పూర్తిగా పడకేసేలా చేసింది. ఇప్పుడు ఈ పోర్టును ఏం చేస్తారో చూడాల్సి ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close