వైసీపీ కాదు ప్రజలే దాడి చేశారన్న వైసీపీ, డీజీపీ !

తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు, నేతల ఇళ్లపై దాడి చేసింది వైసీపీ కార్యకర్తలు కాదని ఆ పార్టీ నేతలు ప్రకటించారు. ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఆగ్రహంతో ప్రజలే దాడి చేశారని ఆ పార్టీ నేత సుధాకర్ బాబు దాడులు జరుగుతున్న సమయంలోనే ప్రెస్‌మీట్ పెట్టి స్పష్టం చేశారు. టీడీపీ నేతలు కావాలని రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. అచ్చంగా వైసీపీ నేతలు చేసిన ప్రకటన తరహాలోనే డీజీపీ ఆఫీసు నుంచి కూడా ప్రకటన రిలీజయింది. రెచ్చగొట్టే వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ఆవేశాలకు లోను కావొద్దని డీజీపీ ఆఫీసు ప్రకటించింది.

రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన వారి పై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని.. చట్టాన్ని ఎవరు తమ చేతిలోకి తీసుకోవద్దు, అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించిది. దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అదనపు బలగాలను మోహరించామని.. ప్రజలందరూ శాంతిభద్రతల పరిరక్షణలో సంయనం పాటిస్తూ సహకరించాలని డీజీపీ ఆఫీస్ కోరింది.

టీడీపీ నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే ప్రజలు వచ్చి దాడి చేశారని డీజీపీ కార్యాలయం చెబుతోది. రాష్ట్ర డీజీపీ కార్యాలయం పక్కనే తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఉంది. పదుల సంఖ్యలో కార్లలో కర్రలు, రాడ్లతో దుండగులు వచ్చి దాడులు చేస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. అంత సేపు దాడులు జరుగుతున్నా పోలీసులు స్పందించలేదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. డీజీపీకి ఫోన్ చేసినా స్పందించలేదని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పారు. మొత్తంగా చూస్తే ఏపీలో వైసీపీ నేతలు దాడులు చేస్తే టీడీపీ నేతలు రెచ్చగొట్టినట్లుగా.. టీడీపీ నేతలు నిరసనలు చేపట్టినా చట్టాలు ఉల్లంఘించినట్లుగా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బస్సు యాత్ర : వైసీపీ రాంగ్ స్ట్రాటజీ

ఎన్నికల షెడ్యూల్ వచ్చినా నోటిఫికేషన్ రావడానికి సమయం ఉండటంతో...జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రను ప్లాన్ చేసుకున్నారు. ఇరవై ఒక్క రోజుల పాటు ఇరవై ఒక్క పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి బస్సు యాత్ర...

చ‌ర‌ణ్ సినిమాలో.. సుకుమార్ హ్యాండ్ ఎంత‌?

సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌పై ద‌ర్శ‌కుడు సుకుమార్ ఓ సినిమా తీశాడంటే అందులో త‌న క్రియేటీవ్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా త‌ప్ప‌కుండా ఉంటుంది. 'విరూపాక్ష‌' సినిమా స్క్రీన్ ప్లేలో సుకుమార్ ఇచ్చిన ఇన్ పుట్స్ బాగా...
video

‘మ‌న‌మే’ ఫ‌స్ట్ సింగిల్: సోలో లైఫే సోబెట‌రంటున్న శ‌ర్వా!

https://www.youtube.com/watch?v=XGJtiqVzZiA ఈమ‌ధ్య టాలీవుడ్ లో గ‌ట్టిగా వినిపిస్తున్న పేరు... హేష‌మ్‌ అబ్దుల్ వాహ‌బ్‌. 'ఖుషి', 'హాయ్ నాన్న‌' సినిమాల్లో సూప‌ర్ హిట్ పాట‌లు ఇచ్చారు. ఇప్పుడు శ‌ర్వానంద్ 'మ‌న‌మే' చిత్రానికీ ఆయ‌నే స్వ‌రాలు అందిస్తున్నారు....

ఇంకా “బలమైన” భ్రమల్లోనే కేటీఆర్ !

కేటీఆర్ నియోజకవర్గాల వారీ సమీక్ష సమావేశాల్లో రేవంత్ రెడ్డిని తిట్టి... ఎన్నికల్లో దున్నిపారేస్తామని ప్రసంగించి వెళ్లిపోతున్నారు. గ్రౌండ్ లెవల్లో పరిస్థితిని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించడం లేదు. కనీసం ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close