మళ్లీ కేకేసిన కోవూరు ఎమ్మెల్యే ! వైసీపీ నేతలంతా లంచగొండులేనట !

నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే వ్యవహారం వైసీపీలో ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే ఉంటుంది. ఆయన వివాదాస్పద ప్రకటనలు చేయడం… అధికారులను దూషించడం వంటి విషయాల్లో ఎప్పుడూ ముందు ఉంటారు. ఈ సారి సొంత పార్టీ క్యాడర్‌పై ఆయన చెలరేగిపోయారు. తన నియోజకవర్గంలో వైసీపీ నేతంలతా లంచాలు తీసుకుని ప్రజల్ని పీడిస్తున్నారని అందుకే ప్రజలు ఆదరించడం లేదని మండిపడ్డారు. ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సొంత మండలం కోట. ఇటీవల పరిషత్ ఎన్నికల్లో కోట మండలంలో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది.

దీనిపై ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ సొంత పార్టీ నేతలపై విరుచుకుపడ్డారు. కోట పరిధిలో వైసీపీ నాయకులు లంచాలకు అలవాటు పడ్డారని సంచలన ఆరోపణలు చేశారు. దాబా పెట్టుకున్నా, షాపు పెట్టుకున్నా, బిల్డింగ్ కడుతున్నా, లే అవుట్ వేసినా, ఏదైనా ప్రారంభోత్సవాలనికి పిలిచినా లంచాలు అడుగుతున్నారని మండిపడ్డారు. అలాంటి వారి వల్ల పార్టీ పరువు, తమ కుటుంబ పరువు మంటగలిసిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి బతుకు ఎందుకని, సూసైడ్ చేసుకుని చనిపోవచ్చు కదా పార్టీ నేతలకు సలహా కూడా ఇచ్చారు.

వైసీపీ నాయకులైనా, తమ బంధువులైనా, ఎవరైనా సరే.. ఇకపై లంచాలు అడిగితే తాట తీస్తా, తోలు తీసేస్తా, పార్టీనుంచి బయటకు పంపించేస్తానంటూ సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. అయితే ఆయనకు తెలియకుండా ఏమీ జరగవని ఆ పార్టీ నేతలో లోపల్లపల గుసగుసలాడుకుంటూ ఉంటారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జ‌గ‌న్ కు షాక్… వైసీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్థికి 18నెల‌ల జైలు

వైసీపీ అధినేత జ‌గ‌న్ కు మ‌రోషాక్ త‌గిలింది. వైసీపీ ఎమ్మెల్యేగా మండ‌పేట అసెంబ్లీ నుండి పోటీ చేస్తున్న ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు కోర్టు 18నెల‌ల జైలు శిక్ష విధించింది. 28 సంవ‌త్స‌రాల క్రితం...

కాంగ్రెస్ మేనిఫెస్టో వర్సెస్ బీజేపీ మేనిఫెస్టో ..!!

లోక్ సభ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించాలని బీజేపీ...ఈసారి ఎలాగైనా అధికారం చేపట్టాలని కాంగ్రెస్ మేనిఫెస్టోకు రూపకల్పన చేసి విడుదల చేశాయి. కాంగ్రెస్ న్యాయ్ పత్ర్ పేరుతో బీజేపీ సంకల్ప్ పత్ర్ పేరుతో...

సంయుక్త‌కు బాలీవుడ్ ఆఫర్‌

భీమ్లా నాయ‌క్‌, బింబిసార‌, సార్‌, విరూపాక్ష‌.... ఇలా తెలుగులో మంచి విజ‌యాల్ని త‌న ఖాతాలో వేసుకొంది సంయుక్త మీన‌న్‌. ప్ర‌స్తుతం నిఖిల్, శ‌ర్వానంద్ చిత్రాల్లో క‌థానాయిక‌గా న‌టిస్తోంది. సౌత్‌లో బిజీగా ఉన్న క‌థానాయిక‌ల‌పై...

‘పుష్ష 2’.. మ‌రో టీజ‌ర్ రెడీనా?

అల్లు అర్జున్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఇటీవ‌ల 'పుష్ష 2' గ్లింప్స్ విడుద‌లైంది. బ‌న్నీ ఫ్యాన్స్‌కు ఈ టీజర్ పూన‌కాలు తెప్పించింది. అయితే... మిగిలిన ఫ్యాన్స్‌కు అంత‌గా ఎక్క‌లేదు. టీజ‌ర్‌లో డైలాగ్ వినిపించ‌క‌పోవ‌డం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close