వైకాపా మైదుకూరు ఎమ్మెల్యే రాజీనామా…దేనికి?

వైకాపా మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. ఆయన ఈరోజు మధ్యాహ్నం తన రాజీనామా లేఖని ఫ్యాక్స్ ద్వారా స్పీకర్ కోడెల శివప్రసాదరావుకి పంపించారు. తన నియోజకవర్గంలో అధికారులు, ప్రోటోకాల్ ని అసలు పట్టించుకోవడం లేదని, తనని అధికారిక కార్యక్రమాలకి ఆహ్వానించి ఎమ్మెల్యేనని కూడా చూడకుండా తన పట్ల చాలా అమర్యాదగా వ్యవహరిస్తున్నారని అందుకు నిరసనగానే రాజీనామా చేస్తున్నట్లు తన లేఖలో పేర్కొన్నారు.

ప్రతిపక్షం పార్టీల ప్రజాప్రతినిధులకి తరచూ ఇటువంటి చేదు అనుభవాలు ఎదురవుతూనే ఉంటాయి. అయినా ఇటువంటి సమస్యలకి నిరసనగా రాజీనామా చేయడం మంచి పద్ధతి కాదు. మొసళ్ళున్న చెరువులో దిగే ముందే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి. రాజకీయాలు కూడా అంతే! ఇటువంటి ఆటుపోటులన్నీ తట్టుకొని నిలబడగలిగిన వాళ్ళే రాజకీయాలలో మనగలుగుతారు. కనుక ఇటువంటి కారణాలతో రఘురామ రెడ్డి రాజీనామా చేయడం కంటే తన రాజకీయ అనుభవంతో పరిస్థితులని తనకి అనుకూలంగా తిప్పుకొనే ప్రయత్నం చేసి ఉండి ఉంటే ఆయన గొప్పదనం అందరూ గుర్తించి ఉండేవారు. తను పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా ముందుగా వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి తెలియజేయకపోయుంటే ఆయన వేరే ఉద్దేశ్యంతో ఈ రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించారని అనుమానించవలసి ఉంటుంది. స్పీకర్ కోడెల శివప్రసాదరావు తనకు అందిన ఆ రాజీనామా లేఖని ఆమోదించినా లేదా ఇదే అదునుగా తెదేపా నేతలు ఆయనని తమవైపు తిప్పుకొన్నా వైకాపా ఎమ్మెల్యేల సంఖ్య మరొకటి తగ్గుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close