చంద్రబాబు ప్రభుత్వంపై వైకాపా అవిశ్వాస తీర్మానం!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు మార్చి 5నుండి మొదలుకాబోతున్నాయి. వైకాపా ఎమ్మెల్యేలను ఇటీవల తెదేపాలోకి ఆకర్షిస్తున్నందుకు తీవ్ర ఆగ్రహంతో ఉన్న వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఈ సమావేశాలను ఒక మంచి అవకాశంగా ఉపయోగించుకొని తెదేపాపై యుద్ధం ప్రకటించారు. స్పీకర్ కోడెల శివ ప్రసాద రావుకి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలనుకొన్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏకంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపైనే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టబోతున్నట్లు సాక్షి మీడియా ప్రకటించింది. అది కూడా అసెంబ్లీ సమావేశాల మొదటిరోజునే ప్రవేశపెట్టాలని నిర్ణయించుకొన్నట్లు పేర్కొంది.

అయితే అసెంబ్లీలో తమ తీర్మాన్ని గెలిపించుకొనేందుకు తమ పార్టీకి తగినంత సంఖ్యా బలం లేదని తెలిసి ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆవేశంతో ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం వలన ఆయన నవ్వులపాలవడమే కాకుండా తన పార్టీ సభ్యులని కూడా అవమానకర పరిస్థితులు ఎదుర్కోవలసి వచ్చేలా చేస్తున్నట్లవుతుంది. ఆయన ఆవేశానికి, దుందుడుకుతనానికి వైకాపా సభ్యులు మూల్యం చెల్లించుకోవలసి రావచ్చును.

వైకాపా ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ వ్యవహారంపై తగిన సలహా ఇచ్చేందుకు స్పీకర్ కోడెల శివప్రసాద రావు ఏర్పాటు చేసిన అసెంబ్లీ సబ్ కమిటీ, సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చాలా అనుచితంగా వ్యవహరిస్తున్న వైకాపా ఎమ్మెల్యేలు రోజా, కొడాలి నానిలపై కటిన చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది. ఇప్పటికే రోజాను సభ నుండి ఏడాది కాలానికి సస్పెండ్ చేయబడ్డారు. ఈ సమావేశాలలో స్పీకర్ ఒకవేళ కోడలి నానిపై కూడా చర్యలు తీసుకొన్నట్లయితే సహజంగానే చాలా ఆవేశపరుడయిన జగన్మోహన్ రెడ్డిని మరింత రెచ్చగొట్టినట్లే అవుతుంది. ఈ కారణంగా వైకాపా సభ్యులు కీలకమయిన బడ్జెట్ సమావేశాలలో సభను స్థంభింపజేసేందుకు ప్రయత్నించడం ఖాయంగా కనిపిస్తోంది కనుక వారందరినీ సభ నుండి సస్పెండ్ చేసి సమావేశాలు కొనసాగిస్తారేమో?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close