చంద్రబాబు, లోకేష్‌లను చంపుతామని అసువుగా బెదిరించేస్తున్నారు !

వైసీపీ నేతల అరాచకాలకు అడ్డే లేకుండా పోయింది. హత్యా రాజకీయాలు ప్రారంభిస్తే చంద్రబాబు, లోకేష్‌లతోనే ప్రారంభిస్తామని వైసీపీ నేతలు మండి పడుతున్నారు. ఎన్నో హత్య కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి బ్రదర్స్ ఈ విషయంలో మరో అడుగు ముందుకేశారు. ఈ తోపుదుర్తి బ్రదర్స్‌లో పెద్దవాడైన చందురెడ్డి.. పరిటాల రవిని వైఎస్సే మొద్దు శీనుతో చంపించాడని… అప్పుడే చంద్రబాబును కూడా చంపమని ఓ మాట చెప్పి ఉంటే.. చంపేసి ఉండేవాడన్నారు. ఇప్పుడు తాము ప్రారంభించాలనుకుంటే లోకేష్‌తోనే ప్రారంభిస్తామన్నారు.

ఉద్దేశపూర్వకంగా రికార్డు చేసుకుని మరీ ఇలా మాట్లాడుతున్న వీడియోను .. తోపుదుర్తి వర్గం లీక్ చేసింది. దీనిపై స్పందించిన టీడీపీ నేతల్ని పోలీసులు అరెస్ట్ చేశారు కానీ.. అలా మాట్లాడిన తోపుదుర్తి చందును మాత్రం అరెస్ట్ చేయలేదు. ఇటీవలి కాలంలో వైసీపీ నేతల నుంచి చంద్రబాబు, లోకేష్‌లను హత్య చేస్తామనే బెదిరింపులు పెరిగిపోతున్నాయి. గతంలో బోరుగడ్డ అనిల్ అనే వైసీపీ నేత కూడా నేరుగా చంద్రబాబును చంపుతానని హెచ్చరించారు.

పోలీసులు పూర్తిగా లా అండ్ ఆర్డర్ తప్పిపోయారు. రాజకీయ విమర్శలు అంటే.. హత్యలు చేస్తామనే బెదిరింపులు అని అనుకుంటున్నారు. ఇలా బెదిరిస్తున్న వారికి హత్యలు చేసిన చరిత్ర కూడా ఉండటంతో.. వీటిని తేలిగ్గా తీసుకోలేమన్న వాదనను టీడీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబుకు ముప్పు ఉందన్న కారణంగా సెక్యూరిటీని పటిష్టం చేశారు. అయినా బెదిరింపులు మాత్రం ఆగడం లేదు. పోలీసులు కూడా ఇలాంటి బెదిరింపుల్ని పట్టించుకోవడం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

4 చోట్ల టీడీపీ అభ్యర్థుల మార్పు ?

తెలుగుదేశం పార్టీ నలుగురు అభ్యర్థులను మార్చాలని నిర్ణయించుకుంది. నరసాపురం సిట్టింగ్ ఎంపీ అయిన కనుమూరు రఘురామకృష్ణరాజు ఉండి అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దింపడం దాదాపు ఖాయమే. మంతెన రామరాజుకు...

విజయమ్మ బర్త్‌డే విషెష్ : షర్మిల చెప్పింది.. జగన్ చెప్పాల్సి వచ్చింది !

వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజును వైఎస్ జగన్ గత మూడేళ్లలో ఎప్పుడూ తల్చుకోలేదు. సోషల్ మీడియాలో చిన్న పోస్టు కూడా పెట్టలేదు. కానీ ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో జగన్ కు...

ఆసుపత్రి వ్యాపారంపై మాధవీలత సంచలన వ్యాఖ్యలు

మాధవీలత... బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి. ఎంఐఎంకు పెట్టని కోటగా ఉన్న హైదరాబాద్ సెగ్మెంట్ లో ఈసారి జెండా పాతుతామని చెప్తున్నా బీజేపీ నేతల వ్యాఖ్యలకు తగ్గట్టుగానే మాధవీలత అందరి దృష్టిని...

బీఆర్ఎస్ కు బిగ్ షాక్ – కాంగ్రెస్ లోచేరిన కేటీఆర్ బావమరిది..!

లోక్ సభ ఎన్నికల ముంగిట బీఆర్ఎస్ కు షాక్ ల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, కీలక నేతలు పార్టీని వీడుతుండగా తాజాగా కేటీఆర్ బావమరిది ఎడ్ల రాహుల్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close