కడపై వైసీపీ ఎంపీ అభ్యర్థిగా ఈ సారి అవినాష్ రెడ్డి కాదట !

కడప వైఎస్ఆర్‌సీపీ ఎంపీ అభ్యర్థిగా వచ్చే ఎన్నికల్లో అవినాష్ రెడ్డికి బదులుగా ఇతరులను బరిలోకి దింపుతారన్న ప్రచారం వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. విచిత్రంగా సజ్జల రామకృష్ణారెడ్డి పేరు కూడా ఇలా ప్రచారానికి వస్తున్న పేర్లలో ఉంది. అయితే ఆ ఇతరులు బయట వ్యక్తులు కాదని.. వైఎస్ కుటుంబం లోని వారేనని అంటున్నారు. తల్లిని విజయలక్ష్మిని ఒప్పించి ఎంపీ సీటులో నిలబెడతారని.. లేదు జగన్ సతీమణి భారతి నిలబెడతారని కొందరు ప్రచారం చేస్తున్నారు. మరికొన్ని ఇతర పేర్లూ ప్రచారంలోకి వస్తున్నాయి.

వచ్చే ఎన్నికలు జగన్ కు సవాల్ గా మారనున్నాయి. దీనికితోడు వివేకా హత్యకేసులో అవినాష్ రెడ్డి ఇరుక్కుంటే అది పెద్ద మరకగా మిగిలిపోనుంది. ఇది వైసీపీకి భారీ ఎదురుదెబ్బ కానుంది. అలాంటి క్లిష్ట పరిస్థితులే ఎదురైతే కడప ఎంపీ స్థానం నుంచి ఎవరు పోటీ చేస్తారనేది కీలకంగా మారనుంది. గత ఎన్నికల్లో వివేకా హత్యకేసు వైసీపీకి ప్రధాన అస్త్రంగా మారింది. ఓట్ల వర్షం కురిపించింది. ఈ ఎన్నికల్లో అదే ఎదురు దెబ్బ అయ్యేలా ఉందని వైసీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. అధికార పీఠం దిగేలా చేసేలా ఉందని గుబులు పట్టుకుందని టీడీపీ ఎద్దేవా చేస్తోంది.

కడప వైసీపీ నుంచి ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డి అరెస్ట్ అయితే ఆ పరిణామాలు పార్టీపై ప్రభావం చూపుతాయని జగన్ వర్గం ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా సీబీఐ దూకుడు ప్రదర్శిస్తూ పులివెందుల కుట్ర కోణాన్ని వెలికి తీయడం వైసీపీలో కలకలం రేపుతోంది. అవినాష్ కు వ్యతిరేకంగా పక్కా ఆధారాలు సేకరిస్తోంది. ఎర్ర గంగిరెడ్డి బెయిల్ కూడా రద్దు కావడంతో కేసు మరింత బిగుసుకుని అవినాష్ రెడ్డి అరెస్ట్ అయితే తరువాత ఎలా ముందుకు వెళ్లాలనే విషయంలో వైసీపీ నేతల్లో అయోమయంలో ఉన్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.

నిజాయితీని నిరూపించుకునేవరకూ అవినాష్ రెడ్డిని పక్కన పెడతామని ప్రకటిస్తే… విజయమ్మ లేదా మరొకరు… వైసీపీ ఎంపీ బరిలో నిలిచే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ట్యాపింగ్ కేసు మొత్తం అధికారులపై నెట్టేసిన కేసీఆర్ !

ట్యాపింగ్ కేసుపై కేసీఆర్ తేల్చేశారు. ఆ కేసులో చట్టవిరుద్ధంగా ఏది జరిగినా అదంతా అధికారుల తప్పే కానీ సీఎంకు.. మంత్రులకు సంబంధం లేదనేశారు. తనకు తెలిసి జరిగినదంతా చట్టబద్దంగా జరిగిందని.. మిగిలిన...

అదేదో ప్రెస్మీట్‌లో చెబితే సరిపోయేదిగా -అన్ని టీవీల్లో వచ్చేది !

పదేళ్ల తర్వాత కేసీఆర్ టీవీ డిబేట్‌లో పాల్గొంటున్నారని బీఆర్ఎస్ నేతలు హడావుడి చేశారు. ఎన్నికల ప్రచారం కోసం ఊళ్లల్లో ఏర్పాటు చేసిన డిజిటల్ ప్రచార వాహనాల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తామని...

వివేకా హత్య కేసులోకి జగన్‌నూ లాక్కొస్తున్న దస్తగిరి !

మావాళ్లు చెప్పినట్లు చేయి.. ఏం జరిగినా అండగా ఉంటానని దస్తగిరికి సీఎం జగన్ స్వయంగా హామీ ఇచ్చారట. ఈ విషయాన్ని స్వయంగా దస్తగిరినే చెబుతున్నారు. వివేకాను చంపే ముందు జగన్ ఆయనతో ఫోన్...

ఖమ్మం సీటు రిస్క్ లో పడేసుకున్న కాంగ్రెస్

కాంగ్రెస్ పార్టీ అత్యంత సులువుగా గెలిచే సీటు ఖమ్మం అనుకున్నారు. మిత్రపక్షంతో కలిసి ఆ లోక్ సభ పరిధిలో ఉన్న అన్ని చోట్లా గెలిచారు. అదీ కూడా భారీ మెజార్టీలతో. ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close