మిగిలిన మూడ్రోజుల్లో ఎన్‌.ఐ.ఎ. కొత్త‌గా ఏం రాబ‌డుతుంది..?

విశాఖ విమానాశ్రయంలో ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ పై కోడి క‌త్తి దాడి కేసును ఇప్పుడు ఎన్‌.ఐ.ఎ. ద‌ర్యాప్తు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. దాడికి పాల్ప‌డ్డ నిందితుడు శ్రీ‌నివాస్ ను ఎన్‌.ఐ.ఎ. అధికారులే విచారిస్తున్నారు. హైద‌రాబాద్ లోని మాదాపూర్ ఎన్‌.ఐ.ఎన్‌. ఆఫీస్ లో శ్రీ‌నివాస్ ను ప్రశ్నిస్తున్నారు. ఇంత‌వ‌ర‌కూ జ‌రిగిన విచార‌ణ‌లో… అవే పాత విష‌యాల‌ను మ‌ళ్లీ మ‌ళ్లీ చెబుతున్నాడ‌ట‌. జ‌గ‌న్ పై దాడి వ్య‌వ‌హారంలో త‌న వెన‌క ఎవ్వ‌రూ లేరని ప‌దేప‌దే చెబుతున్న‌ట్టు స‌మాచారం. అయితే, దాడికి పాల్ప‌డ్డ ముందు కొంత‌మందితో శ్రీ‌నివాస్ ఫోన్లో మాట్లాడిన‌ట్టు గుర్తించారు. ఇప్పుడు వీరి నుంచి మ‌రింత స‌మాచారం రాబ‌ట్టేందుకు అధికారులు ప్ర‌య‌త్నిస్తార‌ని తెలుస్తోంది.

త‌న వెన‌క ఎవ్వ‌రూ లేర‌నీ, త‌న భావాలేంట‌నేవి ఇంత‌కుముందే 11 పేజీల లేఖ రాసిచ్చాన‌నీ, మ‌రో 22 పేజీలు వేరే లేఖ‌లో రాశాన‌ని శ్రీ‌నివాస్ అంటున్నాడ‌ట‌. మ‌ర‌ణించినా ఎలాంటి బాధాలేద‌నీ, కానీ తాను రాసిన ఆ 22 పేజీల పుస్త‌కం విడుద‌ల చేయాలంటూ విచార‌ణ‌లో అధికారుల‌ను కోరుతున్నాడ‌ట‌. సెంట్ర‌ల్ జైలు సిబ్బంది పుస్త‌కం లాక్కున్నార‌నీ, ఏదో ఒక‌టి చేసి దాన్ని విడుద‌ల చేయండీ అంటూ త‌న‌ను క‌లిసిన లాయ‌ర్ తో శ్రీ‌నివాస్ చెప్పుకున్నాడ‌ట. ఎన్‌.ఐ.ఎ. అధికారుల‌ను కూడా శ్రీ‌నివాస్ ఇదే అంశ‌మై ప‌దేప‌దే అడుగుతున్న‌ట్టు తెలుస్తోంది. శ్రీ‌నివాస్ విచార‌ణ‌కు మ‌రో మూడు రోజులు గ‌డువు మాత్ర‌మే ఉంది. తాజా విచారణలో ఇప్ప‌టివ‌ర‌కూ కొత్త అంశాలంటూ ఏవీ రాబ‌ట్టన‌ట్టే తెలుస్తోంది.

ఎన్‌.ఐ.ఎ. విచార‌ణ మొదలుపెట్టిన ద‌గ్గ‌ర్నుంచీ ఏదో జ‌రిగిపోతుంద‌న్న ఆర్భాట‌మే క‌నిపిస్తోంది. కోర్టు ద్వారా శ్రీ‌నివాస్ ను క‌స్ట‌డీకి తీసుకుని… అక్క‌డా ఇక్క‌డా విచార‌ణ అంటూ చ‌క్క‌ర్లు కొట్టారు. అంతేకాదు, కేసు విచార‌ణ‌కు తీసుకోగానే ముందుగా చెయ్యాల్సింది.. బాధితుడి వాంగ్మూలం నమోదు! కానీ, ఇంత‌వ‌ర‌కూ ఆ ఊసే ఎత్త‌డం లేదు. అయితే, ఇది జ‌గ‌న్ కోరుకున్న విచార‌ణే కాబ‌ట్టి, ఇప్పుడు ఆయ‌న స‌హ‌క‌రించే అవ‌కాశం ఉంటుంది. కానీ, ఆ దిశ‌గా ఇంకా ద‌ర్యాప్తు ప్రారంభ‌మే కాలేదు! నిందితుడు శ్రీ‌నివాస్ చుట్టూనే ఎన్‌.ఐ.ఎ. అధికారులు తిరుగుతున్నారు. ‘ఈ కేసులో ఎలా ద‌ర్యాప్తు జ‌ర‌గాలి’ అనేదానిపై అప్ర‌క‌టిత వైకాపా దిశా నిర్దేశం ఇప్ప‌టికే చేసేసిన సంగ‌తి తెలిసిందే! ఎవ‌రిని విచారిస్తే వాస్త‌వాలు బ‌య‌ట‌కి వస్తాయో సాక్షి ప‌త్రికే చెప్పేసిన ప‌రిస్థితి..! మరి, ఎన్‌.ఐ.ఎ. దర్యాప్తు ఎటువైపు వెళ్తుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

HOT NEWS

css.php
[X] Close
[X] Close