కేంద్రంపై కాదు..రాష్ట్రంపైనే యుద్ధం..! బంద్‌కు పిలుపునిచ్చిన జగన్..!!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. మంగళవారం ఆంధ్రప్రదేశ్‌ బంద్‌కు పిలుపునిచ్చారు. దీనికి కారణం… ప్రత్యేకహోదాపై కేంద్రం తీరుకు నిరసనగానట. కేంద్రం ప్రత్యేకహోదా ఇవ్వలేదు.. అందుకనే.. సొంత ప్రజలను ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు జగన్. పార్లమెంట్‌లో ఆంధ్రప్రదేశ్‌ వాయిస్‌ని వినిపించే అవకాశాన్ని రాజీనామాల ద్వారా కావాలనే పోగొట్టుకున్న వైసీపీ అధినేత.. జరిగిపోయిన డ్యామేజీని కొద్దిగా అయినా కంట్రోల్ చేసుకునేందుకు కాకినాడలో ప్రెస్‌మీట్ పెట్టారు. నరేంద్రమోడీ.. పార్లమెంట్‌లో చెప్పిన మాటలను సాక్ష్యంగా చేసుకుని… తెలుగుదేశం పార్టీ మీద…చంద్రబాబు మీద ఆరోపణలు చేశారు. నాలగేళ్లు పాటు హోదా కోసం పోరాడిన హోదాయోధుడ్ని తానేనని స్వయం సర్టిఫికెట్ ఇచ్చుకునేందుకు ప్రాధాన్యం ఇచ్చారు.

కానీ అసలు ప్రత్యేకహోదా ఇవ్వాల్సిన కేంద్రాన్ని కానీ.. ప్రధానమంత్రి నరేంద్రమోడీని కానీ.. ఎక్కడా ఒక్క మాట అనడానికి సాహసించలేకపోయారు.. ప్రతిపక్ష నేత జగన్. ఏపీపై కేంద్రం వ్యవహరిస్తున్న తీరు చూసి తనకు బాధేస్తోందన్నారు కానీ… అలా ఎందుకు చేస్తున్నారు.. ప్రత్యేకహోదా ఎందుకు ఇవ్వరని మాత్రం డిమాండ్ చేయలేకపోయారు. కనీసం నరేంద్రమోడీ పేరు ఎత్తే ధైర్యం కూడా చేయలేకపోయారు. ప్రత్యేకహోదా విషయంలో పార్లమెంట్‌లో జరిగినచర్చలో పాల్గొనే అవకాశాన్ని రాజీనామాలతో కోల్పోయిన వైసీపీ.. తన వాదనను… కాకినాడలో వినిపించింది. విభజన హామీలపై.. పార్లమెంట్‌లో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై చర్చ ముగిసింది. ఆ చర్చను వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి ఫాలో అవలేదు. సాయంత్రం వరకూ ఆయన కోర్టులో ఉన్నారు. కానీ సాయంత్రం మాత్రం.. తాను చాలా దగ్గరగా పార్లమెంట్‌ సమావేశాల్ని ఫాలో అవుతున్నానని… ఉదయమే స్పందిస్తానని ట్వీట్ చేశారు. అనుకున్నట్లుగానే ప్రెస్‌మీట్ పెట్టారు.

నాలుగేళ్ల పాటు అసెంబ్లీలో హోదా కోసం పోరాడామని.. జగన్ చెప్పుకొచ్చారు. కానీ ఏడాది నుంచి ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ వైపే చూడటటం లేదు. ప్రెస్ మీట్ మొత్తం మీద.. కేంద్రం తీరుపై కానీ… విభజన హామీల విషయంలో చేస్తున్న నయవంచనపై కానీ.. ఎక్కాడ పోరాటం చేస్తునట్లు ప్రకటించలేదు. కేవలం నాలుగేళ్లుగా తాము ప్రత్యేకహోదా కోసం పోరాడుతున్నామని చెప్పుకునేందుకు ఎక్కువ సమయం కేటాయించారు. ఆ తర్వాత చంద్రబాబును దోషిగా చూపెట్టేందుకు ఉత్సాహం చూపించారు. పార్లమెంట్‌లో ఏం జరిగిందో చూసిన తర్వాత బీజేపీతో చంద్రబాబు కుమ్మక్కయారని చెప్పేందుకు జగన్ వెనుకాడలేదు. దానికి ఆయన చెప్పిన కారణాలు.. టీటీడీ బోర్డు మెంబర్‌గా… మహారాష్ట్ర బీజేపీ నేత భార్యకు చాన్సివ్వడం… ఎన్టీఆర్ బయోపిక్ సినిమా ప్రారంభోత్సతవానికి వెంకయ్యనాయుడు రావడం. జగన్ అన్నీ చెప్పారు.. కానీ అసలు రాజకీయం మాత్రం మిస్సయ్యారు. జగన్‌ చేస్తున్న రాజకీయం ఆ పార్టీ నేతలకే అర్థం కావడం లేదు. ఎన్నికలకు ముందు అయినా.. బీజేపీపై యుద్ధం ప్రకటించి ఉంటే… బాగుండేదన్న అభిప్రాయం వైసీపీ నేతల్లో ఉంది. కానీ అది జగన్ వల్ల కావడం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close